రాహుల్ గాంధీకి భారీ దెబ్బ: కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ప్రధాన అనుచరుడు, విమర్శలు !
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన అనుచరులల్లోని ప్రముఖ వ్యక్తి ఆశీష్ కులకర్ణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. 2009 నుంచి రాహుల్ గాంధీ ప్రధాన అనుచరుల్లో ఆశీష్ కులకర్ణ
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన అనుచరులల్లోని ప్రముఖ వ్యక్తి ఆశీష్ కులకర్ణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. 2009 నుంచి రాహుల్ గాంధీ ప్రధాన అనుచరుల్లో ఆశీష్ కులకర్ణి ప్రముఖుడు.
కష్టకాలంలో సైతం రాహుల్ గాంధీ వెంట ఉన్న ఆశీష్ కులకర్ణి ఒక్క సారిగా పార్టీకి టాటా చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చిన తరువాత ఆ పార్టీ మీద ఆశీష్ కులకర్ణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రత్యేక కాశ్మీర్ విషయం, జేఎన్ యూ ప్రతిఘటన, మైనారిటీలపై జరిగిన దాడుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుతన్న అనేక ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ దగ్గర ఒక్క సమాధానం లేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, కార్యకర్తలకు న్యాయం చెయ్యలేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆశీష్ కులకర్ణి మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications