నటి రమ్య నియోజకవర్గంపై రాహుల్గాంధీ ప్రత్యేక దృష్టి!
బెంగళూరు/న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుపు కోసం ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏఐసిసి టీం పని చేస్తోంది. దేశవ్యాప్తంగా రాహుల్ టీం ముఖ్యంగా 70 లోకసభ నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించిందట. అందులో ప్రముఖ కన్నడ నటి రమ్య ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మాండ్య నియోజకవర్గం కూడా ఉందట.
సమాచారం మేరకు రాహుల్ గాంధీ డెబ్బై నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించారు. అందులో కర్నాటక రాష్ట్రంలో నాలుగు లోకసభ స్థానాలు ఉన్నాయి. అందులో రమ్య ప్రాతినిథ్యం వహిస్తున్న మాండ్య కూడా ఉంది. అలాగే బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర, బెంగళూరు సెంట్రల్ల పైన రాహుల్ టీం పని చేస్తోందట.

కాగా, లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. బిజెపిలాగా మేము ఎన్నికలకు ముందు చౌకబారు రాజకీయాలు చేయడం లేదన్నారు.
మరోవైపు, భారత దేశ సెక్యులర్ వ్యవస్థ నాశనం కావడానికి, విద్వేషపూరిత నేరాలు చోటు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర విధానమే కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అరుణాచల్ ప్రదేశ్లో అన్నారు. కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఏకం చేయడం, వారి పురోగతికోసం కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమనమన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications