రైల్వే టెండర్ కేసు: రబ్రీ నివాసంలో సీబీఐ సోదాలు, 4 గంటలపాటు తేజస్వి విచారణ
పాట్నా: రైల్వే హోటల్ టెండర్ కేసుకు సంబంధించి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం మధ్యాహ్నం సోదాలు నిర్వహించింది.
లాలూ తనయుడు తేజస్వి యాదవ్ను అధికారులు ప్రశ్నించారు. అతనిని అధికారులు నాలుగు గంటల పాటు విచారించారని తెలుస్తోంది.

రాంచీ, పూరీలలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పోరేషన్ (ఐఆర్సీటీసీ) హోటల్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు నిమిత్తం అధికారులు సోదాలు నిర్వహించి, విచారించారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసుల్లో నేరస్తుడిగా శిక్ష అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications