ఘోరం: బావిలో విగతజీవులుగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు, వారి పిల్లలు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఇక్కడ డూడూ ప్రాంతంలోని బావిలో నవజాత శిశువుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు కనిపించడంతో ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతులు మీనో కా మొహల్లాలో నివసించేవారు. మే 25న మార్కెట్కు వెళ్లాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో మిస్సింగ్ పోస్టర్లు వేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారని వారు తెలిపారు.

బావి నుంచి మృతదేహాలను వెలికితీశామని, పోస్టుమార్టం జరుగుతోందని ఎస్హెచ్ఓ చేతారామ్ తెలిపారు. మృతులను సోదరీమణులు కాళీదేవి (27), మమతా మీనా (23), కమలేష్ మీనా (20), హర్షిత్ (4), మరో 20 రోజుల పాపగా గుర్తించారు.
కాగా, ముగ్గురు సోదరీమణులకు ఒకే కుటుంబానికి చెందిన వారిని వివాహం చేసుకున్నారు. వీరిని అత్తమామలు వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపుల వల్లే వీరంతా బలవన్మరణానికి పాల్పడ్డారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications