ఘోర ప్రమాదం: నదిలో పడిన బస్సు, 32మంది మృతి
జైపూర్: రాజస్థాన్లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది దుర్మరణం చెందారు. మరో 9 మంది గాయపడ్డారు.
సవాయి మధోపూర్లోని దుబి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. సహాయ చర్యలు స్థానికులు కూడా పాల్గొన్నారు.
Rajasthan: #Visuals from the site of accident in Dubi, Sawai Madhopur ; 12 people dead, 24 injured after a bus carrying passengers fell of a bridge into a river pic.twitter.com/7pruEkOjmc
— ANI (@ANI) December 23, 2017
ఇప్పటివరకు 32 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రయాణికులంతా నిద్రలో ఉండటం, బస్సు పూర్తిగా నదిలో మునిగిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని పోలీసులు చెప్పారు.