రాజేకు కొత్త చిక్కు: పద్మశ్రీకి మోడీ పేరు సిఫార్సు
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకి ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా మరో తల నోప్పి వచ్చి పడింది. క్రీడారంగానికి లలిత్ మోదీ అందిస్తున్న సేవలు గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించాలని వసుంధర రాజే సిఫార్సు చేసిన విషయం వెలుగు చూసింది.
వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 జులై 28వ తేదిన లలిత్ మోదీకి పద్మశ్రీ ఇచ్చి సత్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖను క్రీడారంగంలోని అధికారులతోనే కేంద్ర ప్రభుత్వానికి పంపించారని వెలుగు చూసింది.

ఈ విషయం రాజస్థాన్ లోని స్థానిక మీడియా బయట పెట్టింది. లలిత్ మోదీ వ్యాపార రంగాన్ని అభివృద్ది చేస్తున్నారని, అంతే కాకుండ రాష్ట్రంలో క్రికెట్ బోర్డును ప్రగతిపథంలో ముందుకు తీసుకు వెళుతున్నారని చెబుతూ అందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేశారు.
తరువాత లలిత్ మోదీ ఐపీఎల్ కుంబకోణంలో కూరుకుపోయి 2010లో దేశం విడిచి వెళ్లి లండన్ లో తలదాచుకున్నాడు. తన కుమారుడి వ్యాపారంలో లలిత్ మోదీ పెట్టుబడులు పెట్టాడని ఆరోపణలు ఎదుర్కోంటున్న వసుంధర రాజేకి ఇప్పుడు లలిత్ మోదీ వలన ఇంకో కొత్త చిక్కు వచ్చిపడింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications