16మంది మంత్రులకు బెదరింపు మెయిల్స్: దాడులు తప్పవన్న ఐఎం
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్థాన్లో పలువురు మంత్రులకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని ఆ రాష్ట్ర డిజిపి ఒమేంద్ర భరద్వాజ్ చెప్పారు. మంత్రుల అధికారిక మెయిల్ ఐడీలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని ఆయన శుక్రవారం తెలిపారు.
ఆ మెయిల్స్లో ‘మేము ఏం చేస్తామో మీరు అర్థం వేసుకోండి' అంటూ పేర్కొన్నారని డిజిపి తెలిపారు. బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి ఈ మెయిల్స్ పంపిన దుండగుల వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు.
ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులెవరైనా ఉద్దేశ్యపూర్వకంగా ఈ మెయిల్స్ పంపిస్తున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. కేంద్ర సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశామని చెప్పారు.

జనవరి 26న దాడులు తప్పవు : ఐఎం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదులు ఆరాచకం సృష్టించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న దాడులకు పాల్పడుతామని ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హెచ్చరించింది. రాజస్థాన్లోని 16 మంది మంత్రులకు ఐఎం అధికారికంగా మెయిల్ చేసింది.
ఐఎం మెయిల్తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన పట్టణాల్లో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications