రాజస్థాన్ అర్బన్ లోకల్ బాడీ పోల్స్ రిజల్ట్స్: అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చిన బీజేపీ
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన పట్టన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 9 పట్టణ స్థానిక సంస్థల్లోని 3034 వార్డుల్లో 1197 విజయం సాధించింది. పట్టణ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.
కాగా, 20 జిల్లాల్లోని 90 పట్టణ స్థానిక సంస్థలోని మొత్తం 3035 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 3034 స్థానాల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ప్రతిపక్ష పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 1140 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీఎస్పీ 1, సీపీఐ(ఎం) 3, ఎన్సీపీ 46, ఆర్ఎల్పీ 13 వార్డులను, 634 మంది స్వతంత్రులు గెలుపు నమోదు చేశారు.
Recommended Video
కాగా, రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్, బాన్స్వరా, బికానెర్, భిల్వారా, బుండి, ప్రతాప్గఢ్, చిత్తోర్గఢ్, చురు, దుంగార్పూర్, హనుమన్గఢ్, జైసల్మేర్, జలోర్, ఝలవార్, ఝుంఝును, నాగౌర్, పాలి, రాజ్సమండ్ , సికర్, టోక్, ఉదయ్పూర్ జిల్లాలో స్థానిక సంస్థల్లో పోలింగ్ జరిగింది.