రాజ్యసభ ఎన్నికల ఫలితాలు.. ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వచ్చాయంటే...
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాత్రి 9 గంటల వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం...బీజేపీ మొత్తం 19 సీట్లు గెలుచుకుంది. వీటిలో 16 స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకోగా, మూడు స్థానాలను తాజా ఎన్నికల్లో గెలుచుకుంది.
కాంగ్రెస్ 7 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 5 సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకోగా, మరో రెండు సీట్లు తాజాగా గెలుచుకుంది. టీడీపీ ఏకగ్రీవంగా రెండు స్థానాలు గెలుచుకోగా, మరో సీటు కూడా తాజాగా దక్కించుకుని మొత్తం 3 సీట్లు కైవసం చేసుకుంది.
వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా 1 సీటు దక్కించుకుంది. జేడీయూ ఏకగ్రీవంగా 2 సీట్లు, ఆర్జేడీ 2 సీట్లు గెలుచుకున్నాయి. శివసేన 1 సీటును ఏకగ్రీవంగా దక్కించుకుంది. బీజేపీ 3 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. టీఆర్ఎస్ 3 స్థానాలనూ కైవసం చేసుకుంది.
టీఎంసీ పోటీ చేసిన నాలుగు సీట్లు కైవసం చేసుకుని పశ్చిమబెంగాల్లో తనకు తిరుగులేదని చాటుకుంది. ఐదో స్థానానికి టీఎంసీ బలపరిచిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి కూడా గెలుపొందారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఓట్ల లెక్కింపులో జాప్యం చోటుచేసుకుంది. క్రాస్ ఓటింగ్, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ జాప్యం తలెత్తింది.