రాఖీ సావంత్ పార్టీ పేరు ‘రాప్’: గుర్తు ‘పచ్చి మిర్చి’

అంతేగాక తాను ప్రస్తుతం అనాథ రాజకీయ నాయకురాలిని లేదా స్వతంత్ర అభ్యర్థిని అని చెప్పుకున్నారు. ప్రస్తుతం నేను నా సొంత పార్టీని కలిగి ఉన్నానని తెలిపారు. తాను తన పార్టీకి ఉపాధ్యక్షురాలినని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని పోలివుంది కదా అని మీడియా ప్రశ్నించగా.. తన పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తేడా ఉంటుందని చెప్పారు.
తాను త్వరలోనే తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. తాను పేద ప్రజల కోసం, మహిళల భద్రత కోసం కృషి చేస్తానని చెప్పారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే తన చివరి రక్తంబొట్టు పోయే వరకూ పేద ప్రజల అభివృద్ధికి కోసం పాటుపడతానని తెలిపారు. కాగా, రాఖీ సావంత్ పార్టీకి ఆఫీస్ బేరర్లుగా, ఫండ్ రైజర్లుగా స్థానిక వ్యాపారులే ఉండటం గమనార్హం. ఆ వ్యాపారుల భార్యలు పార్టీ మహిళా విభాగానికి నాయకత్వం వహించనున్నట్లు తెలిసింది.
ఇటీవల రాఖీ సావంత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ వస్తే ఆ పార్టీ తరపునే పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాఖీ సొంతంగా పార్టీని స్థాపించారు. ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు రాఖీ చెప్పారు. అయితే తాను బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications