తెలివైన ప్రభుత్వమైతే ఆ పని చేయాలి: సీఏఏ, ఎన్ఆర్సీలపై రామచంద్ర గుహ, బీజేపీ తీవ్ర విమర్శ
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆయనపై కర్ణాటక బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
తెలివైన ప్రభుత్వం ఐతే ఆ పని చేయాలి..
ప్రజల నమ్మకాన్ని పునరుద్ధించేందుకు, దేశ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రభుత్వం ఎన్ఆర్సీని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రామచంద్ర గుహ. అంతేగాక, సీఏఏ అనైతికం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం దీన్ని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తెలివైనదైతే వీటిని ఉపసంహరించుకుంటుందని తన ట్వీట్లో రామచంద్ర గుహ పేర్కొన్నారు.
నిరసనల్లో పాల్గొని అరెస్ట్..
సీఏఏకు వ్యతిరేకంగా కర్ణాటకలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. గురువారం బెంగళూరులో చేపట్టిన నిరసనల్లో రామచంద్ర గుహ పాల్గొన్నారు, దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుత నిరసనలు కూడా చేయనివ్వరా? అంటూ ఆయన ప్రశ్నించారు. నిరసనలు చేయడం పౌరుల హక్కు అని వ్యాఖ్యానించారు.
రామచంద్ర గుహ అర్భన్ నక్సలైట్ అంటూ..
ఇది ఇలావుంటే, కర్ఱాటక బీజేపీ.. రామచంద్ర గుహపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఆయనను అర్భన్ నక్సలైట్గా అభివర్ణించింది. చీకటి ప్రపంచాన్ని నడుపుతున్నాడంటూ ట్విట్టర్ వేదకగా మండిపడింది. ‘ప్రశ్న: మీరు ఎవరు?. జవాబుఫ నా పేరు రామచంద్ర గుహ. చీకటి ప్రపంచంలో కార్యకలాపాలు నిర్వహించే అర్బన్ నక్సల్ గురించి సామాన్యులకు తెలియదు. తమ యజమానుల తరపున హింసను ప్రేరేపించడం, ఆందోళనలు జరపడం ద్వారా తమ ఉనికిని ప్రదర్శిస్తుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. ఇప్పుడు వారంతా బయటికి వస్తున్నారు' అని పేర్కొంది. అంతేగాక, రామచంద్ర గుహ వీడియో ఒకటి దీనికి జోడించింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications