లాలూకు రామ్దేవ్ బాబా పరామర్శ, యోగా చేయాలని సూచన
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను ప్రముఖ యోగ గురువు రామ్దేవ్ బాబా పరామర్శించారు. యోగా చేయాలని రామ్ దేవ్ బాబా లాలూను కోరారు. ఆరోగ్య కారణాల రీత్యా లాలూ ప్రసాద్ యాదవ్కు ఆరు వారా పాటు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్పై ఇంటికొచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. ఇందులో బాగంగా ప్రముఖ యోగ గురువు రామ్ దేవ్ బాబా లాలూను పరారమర్శించారు. ఆరు వారాల పాటు బెయిల్ మంజూరైనందుకు లాలూను ఆయన అభినందించారు.
ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని లాలూకు రామ్ దేవ్ బాబా సూచించారు. పశుదాణా కుంభకోణం కేసులో లాలూ అరెస్టై జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. గత వారం రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్లో లాలూకు ప్రత్యేక చికిత్సలు నిర్వహించారు.
ఆరోగ్యం విషయంలో లాలూకు పలువురు పలు సూచనలు చేస్తున్నారు. 2016లో ఢిల్లీలో నిర్వహించిన యోగా సెషన్కు రామ్ దేవ్ బాబా లాలూను కూడ ఆహ్వనించారు. కానీ, ఆయన ఈ కార్యక్రమానికి హజరు కాలేదు.