నటి రమ్యా తల్లి డిమాండ్: ఎంపీ ఎన్నికల్లో టిక్కెట్ కూతురికి, లేదా తనకే: తేల్చండి !
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్, మాజీ ఎంపీ, నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందనకు అవకాశం ఇవ్వాలని ఆమె తల్లి రంజిత ఆ పార్టీ పెద్దలకు మనవి చేస్తున్నారు. లేదంటే తనకే టిక్కెట్ ఇవ్వాలని రంజిత డిమాండ్ చేస్తున్నారు.
నటి రమ్యాకు అవకాశం ఇవ్వకుంటే తాను పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని రంజిత డిమాండ్ చేస్తున్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి 5 లక్షల ఓట్లు ఉన్నాయని, గతంలో రమ్యా ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారని రంజిత గుర్తు చేశారు.

గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం స్వల్ప మెజారిటీతో రమ్యా ఓడిపోయారని, ఇప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తారని రంజిత ధీమా వ్యక్తం చేశారు. మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో రమ్యా పోటీ చెయ్యడానికి అవసరమైన అఫిడవిట్లను ఆమె తల్లి రంజిత తన న్యాయవాదులతో సిద్దం చేయిస్తున్నారు.
రమ్యా ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నారని, అందువలన ఇక్కడ మీరే పోటీ చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నారని ఇటీవల రంజిత మీడియాకు చెప్పారు. అయితే రమ్యాకు కాని, ఆమె తల్లి రంజితకు కాని ఎన్నికల్లో పోటీ చెయ్యడానకి అవకాశం ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తామని మండ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications