వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిని రేప్ చేసి అబార్షన్ చేయించి, యాసిడ్ తో

|
Google Oneindia TeluguNews

భోపాల్: అమ్మాయిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసి చివరికి యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించిన ఘటన భోపాల్ నగరంలో జరిగింది. 18 ఏళ్ల యువతి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని భోపాల్ సౌత్ ఎస్పీ అంశుమన్ సింగ్ తెలిపారు.

భోపాల్ లోని ఎంపీనగర్ సమీపంలోని షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న వీఐపీ పార్కింగ్ దగ్గర రాత్రి 10 గంటల సమయంలో 18 ఏళ్ల యువతిని పిలుచుకుని ఆమె తల్లి ఇంటికి బయలుదేరుతున్నారు.

ఆ సందర్బంలో రూపేష్, అర్పిత సక్సేనా, జైస్వాల్ అనే ముగ్గురు అక్కడికి వెళ్లారు. తల్లీ, కుమార్తెతో అమర్యాదగా ప్రవర్తించారు. చివరికి అమ్మాయిని నీఅంతు చూస్తాం, నీ మీద యాసిడ్ తో దాడి చేసి చంపేస్తాం అని బెదిరించి వెళ్లారు.

Rape survivor face acide attack threat, case lodged in Bhopal

యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆరు నెలల క్రితం రూపేష్ తన మీద అత్యాచారం చేశాడని, తాను గర్భవతి అయ్యానని పోలీసులకు చెప్పింది. రూపేష్ తన స్నేహితుల సహాయంతో నన్ను ఓ ప్రయివేట్ క్లీనిక్ కు తీసుకు వెళ్లి అబార్షన్ చేయించాడని పోలీసులకు చెప్పింది.

రూపేష్ తో పాటు అతని స్నేహితుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. యువతికి అబార్షన్ చేయించిన క్లీనిక్ చిరునామా కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూపేష్, అతని స్నేహితులు మాయం అయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
The girl and her mother, who works at the mall, were leaving for home on a scooty when two men, identified as Rupesh, Jaiswal and Arpit Saxena, confronted them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X