మత్తిచ్చి రేప్, వీడియో రికార్డింగ్: బాధిత కుటుంబం గ్రామ బహిష్కరణ, రూ. 11వేల ఫైన్
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ యువతికి మత్తు మందిచ్చి అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను వీడియో తీసి బయటపెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామస్థులు వారిని సాంఘిక బహిష్కరణ చేశారు. అంతేకాదు బాధిత కుటుంబానికి రూ.11 వేల జరిమానా కూడ విధించారు.
మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకొన్న ఘటనలు రోజు రోజు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు తీసుకొన్నా కానీ, ఫలితం లేకుండా పోయింది.
రాజస్థాన్ రాష్ట్రంలో మాత్రం లైంగిక దాడికి గురైన యువతికే శిక్ష విధించిన ఘటన కలకలం రేపుతోంది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడమే శాపంగా మారింది.

మత్తు మందిచ్చి రేప్
రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్ఘడ్కు చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను నెట్లో పెడతానని బెదిరించి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకు బాధితురాలిపై నిందితుడి వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు చేయడమే బాధిత కుటుంబానికి తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెట్టింది.

బాధిత కుటుంబం గ్రామ బహిష్కరణ
అత్యాచారానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామ పెద్దలకు కోపం వచ్చింది.ఈ విషయం తెలుసుకొన్న గ్రామ పెద్దలు బాధిత కుటుంబంపై తీవ్ర ఆగ్రహన్ని ప్రదర్శించారు. బాధిత కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించారు. బాధితులకు ఎలాంటి సహయం చేయవద్దని కూడ ఆదేశించారు. కనీసం తిండి గింజలు కూడ ఇవ్వొద్దని కూడ ఆదేశించారు.

రూ.11 వేల జరిమానా విధింపు
బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు గ్రామపంచాయితీ తీర్పును కూడ పాటించకపోవడాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబం రూ.11 వేల జరిమానాను విధిస్తూ గ్రామపంచాయితీ పెద్దలు తీర్మానించారు.

బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి
బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని రాజస్థాన్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ జిల్లా ఎస్పీని ఆదేశించారు. అంతేకాదు బాధితురాలి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన గ్రామ పంచాయితీ పెద్దలను కూడ అరెస్ట్ చేయాలని మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ ఆదేశించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications