పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లతో త్వరలో రూ. 200నోట్లు!: ఆర్బీఐ ప్రతిపాదన
భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.200 నోట్లను తీసుకురానుంది. మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ముంబై: భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.200 నోట్లను తీసుకురానుంది. మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తే జూన్ తరువాత నుంచి వీటి ముద్రణ ప్రారంభం కానుందని వెల్లడించాయి.
నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా.. అవి అనుకున్నంత మేరకు లేకపోవడం, చిన్న నోట్ల కొరత కొనసాగుతుండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా, దీనిపై వ్యాఖ్యానించడానికి రిజర్వు బ్యాంకు అధికార ప్రతినిధి నిరాకరించారు.

గతంలో రూ.1000 నోటు తీసుకువస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే, నోట్ల కొరతను తీర్చేందుకు రూ.200 నోట్లు ఉపయోపడతాయనే యోచలో ఉన్న ఆర్బీఐ.. త్వరలోనే పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త నోట్లను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నోట్ రద్దు తర్వాత కొత్త రూ.500, 2000 నోట్లను ఆర్బీఐ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications