ఇక ఆంక్షల్లేవ్!: 'విత్ డ్రా'పై నిబంధనలు ఎత్తివేసిన ఆర్బీఐ..
గత నెల ఫిబ్రవరి 20న విత్ డ్రాలను ఒక వారంలో రూ.24వేల నుంచి రూ.50వేలకు ఆర్బీఐ పెంచింది. ఆ తర్వాత నేటి నుంచి ఆ నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది.
ముంబై: నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పరిమిత మొత్తంలో మాత్రమే నగదు ఉపసంహరణకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. తాజాగా నేటి నుంచి ఆ ఆంక్షలన్నింటిని ఆర్బీఐ ఎత్తివేసింది.
కాగా, గత నెల ఫిబ్రవరి 20న విత్ డ్రాలను ఒక వారంలో రూ.24వేల నుంచి రూ.50వేలకు ఆర్బీఐ పెంచింది. ఆ తర్వాత నేటి నుంచి ఆ నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ముందుగా చెప్పినట్లుగానే రెండంచెలలో నగదు ఉపసంహరణపై ఆర్బీఐ నిబంధనలు తొలగించింది.

ఆర్బీఐ ఈ నిబంధనలను ఎత్తివేసినప్పటికీ.. ఏటీఎంలలో 'నో క్యాష్' బోర్డులు దర్శనమిస్తుండటంతో.. చాలామంది కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నగదు ఉపసంహరణపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications