రూ.2వేలనగదు నోట్ల ప్రింటింగ్ను నిలిపివేసిన ఆర్బిఐ
ఆర్బిఐ రూ.2వేల రూపాయాల నోట్ల ముద్రణను నిలిపివేసింది. కొత్తగా రూ. 200 నోటును తెచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.
న్యూఢిల్లీ: ఆర్బిఐ రూ.2వేల రూపాయాల నోట్ల ముద్రణను నిలిపివేసింది. కొత్తగా రూ. 200 నోటును తెచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.
పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త రూ.2వేల రూపాయాల నోటును ఆర్బిఐ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే అంతేకాదే కొత్త రూ.500 నోటును కూడ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ప్రస్తుతం చిన్న నగదుపై ఆర్బిఐ కేంద్రీకరిస్తోంది.
రూ.2వేల రూపాయాల నగదు నోటు ముద్రణను ఐదుమాసాల క్రితమే ఆర్బిఐ నిలిపివేసింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలకు నగదు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను కేంద్రం కొత్తగా రూ.2వేల నోటును తీసుకువచ్చింది.

అయితే పెద్దనోట్ల కారణంగా చిల్లర సమస్య తలెత్తింది. పెద్ద నగదు నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్న తరుణంలో చిల్లర నగదు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో చిన్న నగదు ప్రింటింగ్పై ఆర్బిఐ కేంద్రీకరిస్తోంది.
7.4 ట్రిలియన్ విలువగా గల 3.7 బిలియన్ రూ.2 వేల నగదు నోట్లను ఇప్పటివరకు ఆర్బిఐ ముద్రించింది. పెద్దనోట్ల నగదు సమయంలో 6.3 బిలియన్ల వెయ్యి రూపాయాల నోట్ల వెనక్కు తీసుకొన్నారు. దీని కంటే ఎక్కువేనని ఆర్బిఐ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రింట్ చేస్తున్న నగదు నోట్లలో ఎక్కువగా రూ.500 నోట్లే ఎక్కువగా ఉన్నాయి. 14 బిలియన్ రూ.500 నోట్లను ప్రింట్ చేశారు.
నవంబర్ 8వ, తేదినాటికి 7.85 ట్రిలియన్ విలువైన 15.7 బిలియన్ల రూ.500 పాత నోట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రింట్ చేసిన కొత్త రూ. 500 నోట్లు కూడ దాదాపుగా దరిదాపుల్లోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
పెద్దనగదు నోట్ల రద్దు చేసిన ఎనిమిది మాసాల తర్వాత అంటే ఈ ఏడాది జూలై 14వ, తేది నాటికి దేశ వ్యాప్తంగా సుమారు 15.22 ట్రిలియన్ నగదు చలామణిలో ఉంది. అయితే గత ఏడాది నవంబర్ నాలుగవ తేది నాటికి సుమారు 17.7 ట్రిలియన్ నగదు మార్కెట్లో చలామణిలో ఉందని అధికారులు చెబుతున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications