Rebel camp: చీటి చింపేయడానికి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ అయ్యాడు, ఏక్ నాథ్ దెబ్బతో ఏమైనా జరగొచ్చు !
ముంబాయి/గుహవాటి: ఏక్ నాథ్ దెబ్బతో మహారాష్ట్రలో ఏమైనా జరగొచ్చు అని స్పష్టంగా వెలుగు చూసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. కొందరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ కు, అసోంలోని గుహవాటికి వెళ్లిపోవడంతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలు షాక్ అయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఆరు మంది స్వంతత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకి మద్దతు ఇస్తున్నట్లు సంతకాలు చేసి ఆ లేఖను మహారాష్ట్ర గవర్నర్ కు పంపించారు. తనకు సీఎం కావాలని ఆశలేదని ఏక్ నాథ్ షిండే అంటున్నారు. అయితే మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం చీటి చింపేయడానికి, అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఏక్ నాథ్ షిండేకి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ పడ్డాడు.

ఏక్ నాథ్ కు పెరుగుతున్న ఎమ్మెల్యేల మద్దతు
మరాఠీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. కొందరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ కు, అసోంలోని గుహవాటికి వెళ్లిపోయారు.

సీఎంకు షాక్
బుధవారం రాత్రి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వెనుక ఉన్న శివసేన ఎమ్మెల్యేలు కొందరు ఇప్పుడు ఆ గ్రూప్ నుంచి రెబల్ గ్రూప్ లోకి వెళ్లిపోవడంతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలు షాక్ అయ్యారు. బుదవారం రాత్రి సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన అధికారిక నివాసం ఖాలీ చేశారు. ఉద్దవ్ ఠాక్రే త్వరలో ఆయన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని శివసేనకు చెందిన కొందరు నాయకులు అంటున్నారు.

సీఎం కావాలని ఆశలేదు
తనకు సీఎం కావాలని ఆశలేదని ఏక్ నాథ్ షిండే అంటున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. ఇప్పటికే 34 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఆరు మంది స్వంతత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకి మద్దతు ఇస్తున్నట్లు సంతకాలు చేసి ఆ లేఖను మహారాష్ట్ర గవర్నర్ కు పంపించారు.

46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు
తనకు 6 నుంచి 7 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో సహ మొత్తం 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గుహవాటిలోని రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ లో ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం చీటి చింపేయడానికి, అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఏక్ నాథ్ షిండేకి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ పడ్డాడని ప్రముఖ జాతీయ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications