రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం...! వారి రాజకీయా సమాధి ప్రజలే కడతారు.. సిద్దరామయ్యా
మరి కాసేపట్లో కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకునే అవకాశం సన్నగిల్లుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నేత సిద్దరామయ్యా తన అసహానాన్ని వ్యక్తం చేశారు. 2013లో రాజీనామ చేసిన గతే ప్రస్థుతం రాజీనామ చేసిన ఎమ్మెల్యేలకు పడుతుందని, వారిపై వేటు పడడం ఖాయమని ఆయన అన్నారు.
ఈనేపథ్యంలోనే రెబల్ ఎమ్మెల్యేలకు ఓక్కోక్కరికి 20 నుండి 50 కోట్ల రుపాయాలు ఎక్కడి నుండి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. కాగ వారందరు డిస్క్వాలిఫై అవుతారని తెలిపారు. మరోవైపు రాజకీయ సమాధి కావడం ఖాయమని చెప్పారు. ఇలాంటీ పరిస్థితే 2013లో వచ్చిందని అప్పుడు రాజీనామా చేసిన వారు కూడ రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అన్నారు. అది జరగాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
మొత్తం మీద కర్ణాటకలో కూటమి బలం బీజేపీతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆలోచనతోపాటు కూటమి వర్గాల్లో ఓక్కోక్కరు బయటకు రావడంతో ఇన్నాళ్లు మద్దతు కోసం ప్రయత్నాలు చేసిన సిద్దరామయ్యతో పాటు డికే శివకుమార్ చేతులెత్తయడంతో అసెంబ్లీ బల నిరూపణపై ఉత్కంఠ నెలకొంది.