వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే రేప్‌లు ఆగుతాయి"

By Pratap
|
Google Oneindia TeluguNews

Religious leader urges government to legalise prostitution to curb rape
బెంగళూర్‌: పాశ్చాత్య దుస్తులు ధరించే అమ్మాయిలు కామాంధుల కళ్ళలో పడి అత్యాచారాలకు గురవుతారంటూ బసవధర్మ పీఠాధిపతి మాతే జగద్గురు మహాదేవి వ్యాఖ్యానించారు. అదేసమయంలో దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే అత్యాచారాలు తగ్గుతాయని మాతే శ్రీ సెలవిచ్చారు.

కర్ణాటకలోని ధార్వాడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పీఠాధిపతి పాల్గొని మాట్లాడారు. కొందరు మహిళలు తమ రక్షణ కోసం ఉన్న చట్టాలను ఆసరాగా చేసుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడతున్నారని మహాదేవి విమర్శించారు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే అత్యాచారాలు తగ్గుతాయని కూడా సెలవిచ్చారీ మాతే శ్రీ.

ఈ మేరకు ఆమె కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. తన సూచనలపై ప్రభుత్వాన్ని ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై కర్ణాటకలో మహిళా, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

మహాదేవి వ్యాఖ్యలు మహిళలను, వారి వస్త్రధారణను అవమానపరిచేలా ఉన్నాయని నిరసన వ్యక్తం చేశాయి. కర్ణాటకలో జగద్గురు మహాదేవిగా ప్రసిద్ధికెక్కిన ఈ బసవధర్మ పీఠాధిపతిని అక్కడి లింగాయత్ వర్గీయులు విశేషంగా ఆరాధిస్తారు. మతే మహాదేవి లింగాయత్‌ల ఏకైక మహిళా జగద్గురు.

మహిళలు, ముఖ్యంగా అమ్మాయిలు పాశ్చాత్య వస్త్రధారణకు స్వస్తి చెప్పాలని ఆమె సూచించారు. సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే దుస్తులు ధరించాలని ఆమె అన్నారు. యువతరంలో సంప్రదాయ విలువల డొల్లతనం చోటు చేసుకుందని అన్నారు.

English summary

 A prominent religious head of Lingayats - Karnataka's largest community - has kicked up a storm by saying that "provocative dressing sense of women" has led to a steep rise in rapes across the country. Mathe Mahadevi, the lone woman 'Jagadguru' of Lingayats, also urged the government to legalise prostitution to curb the menace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X