Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారతీయ అడ్వర్టైజింగ్ గుండె ఆగింది: క్రియేటివిటీకి చిరునామా పీయూష్ పాండే ఇక లేరు..!!

భారతదేశ అడ్వర్టైజింగ్ ప్రపంచంలో ఒక యుగాన్ని మార్చేసిన మహా మేధావి, పీయూష్ పాండే (Piyush Pandey) ఇక లేరు. అక్టోబర్ 24, 2025, శుక్రవారం నాడు ఆయన తుది శ్వాస విడిచారు. భారతీయ కమ్యూనికేషన్‌కు స్థానిక భాష, మానవత్వం, హాస్యం నేర్పించిన వ్యక్తిగా ఆయన మిగిలిపోయారు.

ఓగిల్వీ ఇండియా (Ogilvy India) మాజీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న పీయూష్ పాండే, ఆ సంస్థను భారతదేశంలోనే నెంబర్ 1 క్రియేటివ్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న తన కెరీర్‌లో, ఆయన ఏకంగా 1,000కు పైగా అవార్డులు గెలుచుకున్నారు. కాన్స్ లయన్స్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీ (Cannes Lions Festival of Creativity) జ్యూరీ ప్రెసిడెంట్‌గా ఎంపికైన మొదటి ఆసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

remembering-piyush-pandey-the-creative-soul-who-redefined-indian-advertising

అవార్డుల కంటే గొప్ప వారసత్వం: ఇండియా వాయిస్
పీయూష్ పాండే గొప్పదనం కేవలం అవార్డులలో లేదు. ఆయన భారతదేశాన్ని తన సొంత భాషను, ఆత్మను ప్రేమించేలా చేశారు. ప్రకటనల్లో హిందీని, స్థానిక వాడుక భాషను బాగా వాడుకలోకి తెచ్చి, పాశ్చాత్య ప్రభావం నుంచి భారతీయ క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చారు.

  • ఫెవికాల్‌ ప్రకటనల్లోని తెగని హాస్యం నుండి
  • క్యాడ్‌బరీ డైరీ మిల్క్ "కుచ్ ఖాస్ హై జిందగీ మే" (జీవితంలో ఏదో ప్రత్యేకత ఉంది) వంటి హృదయాన్ని హత్తుకునే ట్యాగ్‌లైన్స్ వరకు...

ఆయన పని భారతీయ ప్రజల సామూహిక జ్ఞాపకశక్తిలో ఒక భాగమైపోయింది.

ప్రముఖుల నివాళులు: "ఓ తరం జ్ఞాపకాల్ని తీసుకెళ్లారు"
ఆయన మరణంపై భారతీయ క్రియేటివ్ రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

  • ఆండ్రే టిమ్మిన్స్ (Wizcraft International Co-founder): "ఆయన కేవలం యాడ్స్ చేయలేదు- సాంస్కృతిక మైలురాళ్లను సృష్టించారు. ఆయన క్రియేటివ్ భాష మన భారతీయ జీవితంలో ఉంది- సింపుల్‌గా, నిజాయితీగా, తెలివిగా, మానవత్వంతో నిండి ఉంటుంది. ఆయన మన ప్రజా సంస్కృతిని మార్చిన గొప్ప ప్రచారాలను, ఆయన స్ఫూర్తితో ఎదిగిన ఓ తరాన్ని వదిలి వెళ్లారు."
  • నెవిల్లే షా (Writer, Adman): "కొంతమంది లోకం వీడి వెళ్లినప్పుడు, వారితో పాటు ఓ తరం జ్ఞాపకాలలో కొంత భాగం తీసుకెళ్తారు. పీయూష్ అలాంటి మనిషే."
  • సుజయ్ రాచ్ (Nuvama Group CMO): "పీయూష్ పాండే లాంటి వ్యక్తులు నిజంగా మనలని వదిలి వెళ్లిపోలేదు.ఆయన పనితనం,పాటించే సూత్రాలు, సంస్కృతి...ఆయన తర్వాత కూడా బతికే ఉంటాయి. ఇండియన్ అడ్వర్టైజింగ్‌‌కు ప్రాణం పోసిన వ్యక్తి పీయూష్."

అమ్మకం కాదు, అనుభూతి ముఖ్యం
ఆయన మేధావి తనంలో క్రియేటివిటీ మాత్రమే కాదు, మానవత్వం కూడా ఉంది. మంచి అడ్వర్టైజింగ్ అంటే కేవలం వస్తువులను అమ్మడం కాదని, అది అనుభూతిని పంచడం అని ఆయన ఈ పరిశ్రమకు నేర్పారు.భారతీయ కమ్యూనికేషన్‌కు ఆయన చేసిన అసాధారణ సేవకు గాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్నారు.

పీయూష్ పాండే మరణం పట్ల దేశ నలుమూలల నుంచే కాక యావత్ ప్రపంచ దేశాల నుంచి కూడా నివాళులు వెల్లువెత్తుతున్నాయి. అడ్వర్టయిజింగ్ రంగం నుంచే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆయనతో పనిచేసిన సహోద్యోగులు ఎటర్నల్ ట్రిబ్యూట్ పేజ్‌ ద్వారా తమ నివాళులు అర్పిస్తున్నారు. ఎటర్నల్ ట్రిబ్యూట్ పేజ్ (Eternal Tribute Page)అనేది మన కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులు మరెవరైనా సరే మరణిస్తే వారికి డిజిటల్ పద్ధతిలో ఘన నివాళులు అర్పించేందుకు వన్ ఇండియా తీసుకొచ్చిన సృజనాత్మక వేదిక.

పీయూష్ పాండే మరణం ఒక పూడ్చలేని లోటు. కానీ ఆయన వారసత్వం-ఆయన నవ్వు, మార్గదర్శనం, మరియు భారతదేశాన్ని కీర్తించే కథలపై ఆయనకున్న నమ్మకం- భవిష్యత్ తరాల సృష్టికర్తలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది.

ఓం శాంతి, పీయూష్ పాండే - భారతీయ అడ్వర్టైజింగ్ రంగానికి ఒక గుండెకాయ లాంటి వారు. ఒక గొంతుకగా నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+