రిటైర్డ్ జడ్జీలను హైకోర్టు అదనపు జడ్జీలుగా నియమించుకోవచ్చు: తేల్చేసిన సుప్రీం
న్యూఢిల్లీ: రిటైర్డ్ జడ్జీలను తిరిగి నియమించుకోవడంపై దాఖలైన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ వీరేంద్ర కుమార్, జస్టిస్ రామచంద్ర సింగ్ ఝాలాలను రాజస్థాన్ హైకోర్టులో అదనపు జడ్జీలుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ సునీల్ సందారియా అనే న్యాయవాదిపై సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేశారు.
పిటిషన్ విచారించిన జస్టిస్ ఏకే సిక్రీ, అశోక్ భూషణ్తో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ నియామకాలను సమర్థించింది. రిటైర్డ్ జడ్జీలను తిరిగి నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(3)(ఏ) కింద రిటైర్డ్ న్యాయాధికారులను హైకోర్టు జడ్జీలుగా నియమించుకోవచ్చని తెలిపింది.

అయితే, వారు రాష్ట్రంలోని న్యాయ విభాగంలో సేవలందించి ఉండాలని తెలిపింది. రిటైర్డ్ జిల్లా జడ్జీలను కూడా హైకోర్టుల్లో అదనపు జడ్జీలుగా నియమించుకోవచ్చని సుప్రీం ధర్మాసంన స్పష్టం చేసింది. ఈ నియామకాలు రెండేళ్లకు మించిన పదవీ కాలానికి ఉండకూడదని పేర్కొంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications