ర్యాట్ హోల్: 12 రోజుల క్రితం మైన్స్లో చిక్కుకున్న 15మంది, రెస్క్యూ ఆపరేషన్
గౌహతి: మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని లుంతారీ గ్రామం క్సాన్ పరిధిలోని కోల్ మైన్స్లో దాదాపు పదిహేను మంది చిక్కుకుపోయారు. మైన్స్లో డిసెంబర్ 13వ తేదీన చిక్కుకున్నారు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సహా రెస్క్యూ టీం మైన్స్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అహర్నిషలు కృషి చేస్తోంది. వారు మైన్స్లో చిక్కుకొని దాదాపు రెండు వారాలు కావొస్తుంది.
తాజాగా, సోమవారం సహాయక చర్యలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. నీరు పెరుగుతుండటం సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ఇది అక్రమ మైనింగ్గా తెలుస్తోంది. పదిహేను మంది 370 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
ఎన్డీఆర్ఎఫ్, జిల్లా అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. 25 హార్స్ పవర్ పంపులు రెండింటిని ఉపయోగించి నీటిని తోడేస్తున్నారు 100 హార్స్ పవర్ పంపుల ద్వారా నీటిని తోడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధపడ్డారు.

సమాచారం మేరకు మైన్స్లో చిక్కుకున్న వారు అందరు కూడా జీవించే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
డిసెంబర్ 13వ తేదీన దాదాపు 20 మంది మైనింగ్ వర్కర్స్ లోనికి వెళ్లారు. వారు లోపలకు వెళ్లాక ర్యాట్ హోల్స్లో చిక్కుకుపోయారు. అవి చాలా ఇరుకుగా ఉన్నాయి. ఐదుగురు బయటకు రాగలిగారు. మరో 15 మంది అందులోనే చిక్కుకుపోయారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications