మహిళకు వందనం: చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్గా కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్త
నాలుగేళ్ల వయస్సులో తను నడుస్తున్నప్పుడు చంద్రుడు తన వెంటే ఎందుకు వస్తున్నాడు అనే ఆలోచన ఆమెలో మొదలైంది. అసలు చంద్రడు అంత ఎత్తున ఎలా ఉన్నాడు అనే ఆలోచన మొదలైంది. కానీ నేడు అదే చందమామ పైకి ఓ మిషన్ను పంపే జట్టులో తాను భాగస్వామి అవుతానని ఊహించి ఉండదు. అవును చంద్రయాన్-2 ప్రాజెక్టులో ప్రధాన భూమిక పోషించింది ఒక మహిళ. ఆమెపేరే రీతూ కరిధాల్.
చంద్రుడిపై నీటి ఆనవాలు, ఇతర అంశాలను వెలికి తీసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగిస్తోంది. ఈ మిషన్ను పంపడంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. చంద్రయాన్ -2 టీమ్ను రీతూ కరిధాల్ లీడ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి పరిశోధనల్లో ప్రపంచ వ్యాప్తంగా 28.8శాతం మంది మహిళలు పాల్గొంటున్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. సాధారణంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మ్యాథమ్యాటిక్స్ రంగంలో మహిళలు తక్కువమంది కనిపిస్తారు. ఒక వేళ ఈ రంగంలోకి అడుగుపెడితే ఈ రంగంకే తమ జీవితాన్ని అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 69 సైన్స్ అకాడెమీల్లో 12 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు మాత్రమే పనిచేస్తున్నారు.

నోబెల్ ప్రైజ్ 1901లో ఏర్పాటు అయ్యాక ఇప్పటి వరకు సైన్స్ కేటగిరీలో 17 మంది మహిళలు మాత్రమే ఈ ప్రైజ్ను గెలుచుకోగలిగారు. సైన్స్ రంగంలో, పరిశోధన కేంద్రాల్లో , అత్యున్నత స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో మహిళలు ఉన్నారు కానీ... 1969 ఆగష్టు 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఇస్రోలో మాత్రం ఈ టాప్ పొజిషన్లో ఒక మహిళ అది కూడా రీతూ ఉండటం విశేషం. పురుషాధిక్యత ఉన్న ఈ రంగంలో మహిళలు కూడా రాణించడం నిజంగా హర్షణీయం. చంద్రయాన్ -2 ప్రాజెక్టులో మిషన్ డైరెక్టర్గా రీతూ కరిధాల్ నియామకం ఒక సంచలనం. సైన్స్ అనేది అమ్మాయిలకు కాదు అని చెప్పే ప్రతి ఒక్కరికి రీతూ సాధించిన విజయమే నిదర్శనం. ఓ వైపు చంద్రయాన్ ప్రాజెక్టుకు సమయం కేటాయిస్తూ మరో వైపు కుటుంబంను చూసుకుంటూ సమతుల్యత పాటించడంలో రీతూ సక్సెస్ అయ్యారు. అంతకుముందు మార్స్ మిషన్లో కూడా పనిచేసి విజయం సాధించారు రీతూ.
మొత్తానికి చంద్రయాన్ -2 విజయం తర్వాత ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు రీతూ కరిధాల్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుతున్న అమ్మాయిలకు రీతూ కచ్చితంగా ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. విజయాలకు ఆకాశమే హద్దు అని పెట్టుకోకుండా నిరంతరం కృషి చేసి భారత్ను ప్రపంచదేశాల సరసన సగర్వంగా నిలిచేలా కీలక పాత్ర పోషించారు రీతూ.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications