Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధికార పార్టీ నాయకుడు, హాయ్ చెప్పి కాల్చి పారేసిన ప్రత్యర్థులు, లండన్ లో కూతురు !

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఈడీ అధికారుల బృందంపై వందలాది మంది స్థానికులు దాడి చేశారు. టీఎంసీ నాయకుడిపై ఈడీ అధికారుల దాడి చేయడంతో రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు ఈడీ అధికారులపై దాడి చెయ్యడం పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపింది.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడిని పట్టపగలు దారుణంగా హత్య చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టీఎంసీ పవర్ ఫుల్ మాస్ నాయకుడు సత్యన్ చౌదరిపై ఆదివారం పట్టపగలు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌లో చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌ టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యన్ చౌదరిని వెంటనే ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యన్ చౌదరి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసు అధికారులు తెలిపారు.

Rivals gunned down a ruling party leader in a building under construction in West Bengal.

బైక్‌లపై వచ్చిన కొందరు దుండగులు సత్యన్ చౌదరిపై అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం సత్యన్ చౌదరి కుప్పకూలిపోయాడని స్థానిక టీఎంసీ నేత ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు టీఎంసీ నేత సత్యన్ చౌదరి హత్య కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సత్యన్ చౌదరి గతంలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరికి సన్నిహితంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత సత్యన్ చౌదరి టీఎంసీ మాస్ లీడర్ ముకుల్ రాయ్‌తో కలిసి పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీలో చేరారు.

ముర్షిదాబాద్ ప్రాంతంలో ప్రముఖ నాయకుడిగా సత్యన్ చౌదరి గుర్తింపు పొందారు. మృతి చెందిన టీఎంసీ నేత సత్యన్ చౌదరి కుమార్తె లండన్‌లో చదువుతున్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం భరత్‌పూర్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సత్యన్ చౌదరి అతని సన్నిహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్న సమయంలో బైక్ లో వచ్చిన కొందరు దుండగులు తుపాకులు, రివాల్వర్లతో కాల్పులు జరిపారు.

Rivals gunned down a ruling party leader in a building under construction in West Bengal.

సత్యన్ చౌదరి హత్యకు గురైనారని వెలుగులోకి రాగానే ఆ ప్రాంతంలో దుమారం రేగింది. సీపీఎం పార్టీ నాయకులు సత్యన్ చౌదరిని హత్య చేశారని బెర్హంపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముఖోపాధ్యాయ ఆరోపించారు.అయితే సీపీఐ (ఎం) ముర్షీదాబాద్ జిల్లా కార్యదర్శి జమీర్ మొల్లా మాట్లాడుతూ టీఎంసీలో అంతర్గత పోరు వలనే సత్యన్ చౌదరి హత్యకు గురైనాడని ఆరోపించారు.

ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా సత్యన్ చౌదరి హత్యకు గురయ్యాడని సీపీఎం నాయకులు ఆరోపించారు. సత్యన్ చౌదరి హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పార్టీ నాయకులు చెప్పారు.సత్యన్ చౌదరి హత్య కేసు విచారణ ప్రారంభించామని, సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సూర్యప్రతాప్ యాదవ్ మీడియాకు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+