అధికార పార్టీ నాయకుడు, హాయ్ చెప్పి కాల్చి పారేసిన ప్రత్యర్థులు, లండన్ లో కూతురు !
పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఈడీ అధికారుల బృందంపై వందలాది మంది స్థానికులు దాడి చేశారు. టీఎంసీ నాయకుడిపై ఈడీ అధికారుల దాడి చేయడంతో రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు ఈడీ అధికారులపై దాడి చెయ్యడం పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపింది.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడిని పట్టపగలు దారుణంగా హత్య చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీఎంసీ పవర్ ఫుల్ మాస్ నాయకుడు సత్యన్ చౌదరిపై ఆదివారం పట్టపగలు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్లో చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యన్ చౌదరిని వెంటనే ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యన్ చౌదరి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసు అధికారులు తెలిపారు.

బైక్లపై వచ్చిన కొందరు దుండగులు సత్యన్ చౌదరిపై అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం సత్యన్ చౌదరి కుప్పకూలిపోయాడని స్థానిక టీఎంసీ నేత ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు టీఎంసీ నేత సత్యన్ చౌదరి హత్య కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సత్యన్ చౌదరి గతంలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరికి సన్నిహితంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత సత్యన్ చౌదరి టీఎంసీ మాస్ లీడర్ ముకుల్ రాయ్తో కలిసి పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీలో చేరారు.
ముర్షిదాబాద్ ప్రాంతంలో ప్రముఖ నాయకుడిగా సత్యన్ చౌదరి గుర్తింపు పొందారు. మృతి చెందిన టీఎంసీ నేత సత్యన్ చౌదరి కుమార్తె లండన్లో చదువుతున్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం భరత్పూర్లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సత్యన్ చౌదరి అతని సన్నిహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్న సమయంలో బైక్ లో వచ్చిన కొందరు దుండగులు తుపాకులు, రివాల్వర్లతో కాల్పులు జరిపారు.

సత్యన్ చౌదరి హత్యకు గురైనారని వెలుగులోకి రాగానే ఆ ప్రాంతంలో దుమారం రేగింది. సీపీఎం పార్టీ నాయకులు సత్యన్ చౌదరిని హత్య చేశారని బెర్హంపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముఖోపాధ్యాయ ఆరోపించారు.అయితే సీపీఐ (ఎం) ముర్షీదాబాద్ జిల్లా కార్యదర్శి జమీర్ మొల్లా మాట్లాడుతూ టీఎంసీలో అంతర్గత పోరు వలనే సత్యన్ చౌదరి హత్యకు గురైనాడని ఆరోపించారు.
ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా సత్యన్ చౌదరి హత్యకు గురయ్యాడని సీపీఎం నాయకులు ఆరోపించారు. సత్యన్ చౌదరి హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పార్టీ నాయకులు చెప్పారు.సత్యన్ చౌదరి హత్య కేసు విచారణ ప్రారంభించామని, సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సూర్యప్రతాప్ యాదవ్ మీడియాకు తెలిపారు.
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications