మోడీపై లాలూ సెటైర్: దేశాన్ని ఫుట్బాల్ ఆడేస్తున్నారు..
మోడీజీ.. మీరు, మీ మంత్రులు ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. అంతేకానీ, ఫుట్ బాల్ ఆడటం లేదు అన్న సంగతి గుర్తెరగాలని ట్విట్టర్ ద్వారా లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పాట్నా: పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. మోడీ ఈ దేశాన్ని ఫుట్ బాల్ లా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలపై లాలూ స్పందిస్తూ, తన ట్విట్టర్ వేదికగా మోడీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించిందని లాలూ మండిపడ్డారు. నల్లధనాన్ని అరికట్టడం, ఉగ్రవాదం, నకిలీ కరెన్సీని అడ్డుకుంటామని చెబుతోన్న మాటలన్ని వట్టి అవాస్తవాలేనని కొట్టిపారేశారు.
मोदी ने देश को फुटबॉल बना दिया है। ये एक तरफ किक मारते है, मंत्री दूसरी तरफ, तीसरा मंत्री किसी ओर तरफ, RBI/वित्त विभाग की अपनी-अपनी किक..
— Lalu Prasad Yadav (@laluprasadrjd) December 15, 2016
'ప్రధాని మోడీ ఈ దేశాన్ని ఫుట్ బాల్ లాగా మార్చేశారు. ప్రధాని, మంత్రులు బాల్ ను తలా ఒక వైపు తన్నుతుంటే.. మరో వైపు ఆర్బీఐ లేదా ఆర్థిక శాఖ వాటి కిక్ లు అవి ఇస్తున్నాయి. మోడీజీ.. మీరు, మీ మంత్రులు ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. అంతేకానీ, ఫుట్ బాల్ ఆడటం లేదు' అంటూ లాలూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.