అడ్డంగా దొరికాడు.. శశికళ ఫిర్యాదు: 'దినకరన్ రాజకీయ జీవితం ఖతం'
రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప మంగళవారం నాడు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిశారు. ఓట్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికారని, కాబట్టి ఆయనపై వేటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
చెన్నై: రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప మంగళవారం నాడు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిశారు. ఓట్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికారని, కాబట్టి ఆయనపై వేటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

దినకరన్పై వేటు వేయాలని
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తర్వాత కూడా ఆయన పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. దినకరన్పై చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చిందని చెప్పారు.

దినకరన్ రాజకీయ జీవితం ఖతం
అన్నాడీఎంకే అమ్మ పార్టీ డిప్యూటీ కార్యదర్శి టీటీవీ దినకరన్ రాజకీయ జీవితం ముగిసినట్లేనని మాజీ ముక్యమంత్రి పన్నీరుసెల్వం వర్గం విమర్శిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం సమాయత్తమైంది.
భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నాయకత్వంలోని అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం నాయకులు విమర్శల దాడి ప్రారంభించారు.

కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేందుకు మంత్రులు బలి
ఆర్కేనగర్లో నగదు పంపిణీలో దినకరన్ పాత్ర ఉందని ప్రపంచమంతా కోడై కూస్తుందని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేపీ మునుస్వామి ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఆరుగురు మంత్రులను బలిపశువులను చేశారన్నారు.

లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాం
తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ నివాసంలో ఐటీ శాఖ దాడులు చేసి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులో ప్రతిపక్షం డీఎంకే నాయకులు కూడా ఓటుకు రూ.2వేల వరకు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి కుట్రలు ఎన్ని పన్నినా తమ అభ్యర్థి మధుసూదనన్ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని మునుస్వామి ధీమా వ్యక్తం చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications