ఇప్పుడు అమిత్ షా.. శనివారం నుంచి 2 రోజుల టూర్, బెంగాల్లో బిజీ బిజీ
పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జేపీ నడ్డా పర్యటించగా.. ఇప్పుడు అమిత్ షా వంతు వచ్చింది. రాష్ట్రంలో రెండురోజులు పర్యటించి.. క్యాడర్లో జోష్ నింపబోతున్నారు. నడ్డా కాన్వాయ్ దాడిపై వివాదం కొనసాగుతోన్న తరుణంలో శనివారం నుంచి రెండురోజులు అమిత్ షా పర్యటించబోతున్నారు.
పర్యటనలో అమిత్ షా రోడ్ షో, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీర్భ్మ్లో రోడ్ షో, మిడ్నాపూర్లో ర్యాలీలో మాట్లాడతారు. టీఎంసీని వీడిన బెంగాల్ మాజీ మంత్రి సువెంద్ అదికారి మిడ్నాపూర్లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీర్బుమ్లో అమిత్ షా రోడ్ షో ఆదివారం ఉంటుంది. అంతకుముందు విశ్వభారతీ వర్సిటీలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పర్యటనలో భాగంగా సమీపంలో గల ఆలయాలను అమిత్ షా సందర్శిస్తారు. స్థానికులతో కలిసి భోజనం చేస్తారు. వచ్చే ఏడాది జరిగే బెంగాల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 200 చోట్ల గెలవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే అమిత్ షా పర్యటించబోతున్నారు. తర్వాత కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, మధ్యప్రదేశ్ మంత్రులు నరోత్తం మిశ్రా, సంజీవ్ బాల్యన్, ప్రహ్లాద్ పటల్, అర్జున్ ముండా, మంసుఖ్ మాండవియా ఉన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications