మణిపూర్ మిలిటెంట్ దాడి: చైనా ఆర్మీ సహకారం ఉందా?, మయన్మార్ను అలర్ట్ చేసిన భారత్
న్యూఢిల్లీ: మణిపూర్లో గత వారం చివరలో జరిగిన మిలిటెంట్ మెరుపుదాడిలో అస్సాం రైఫిల్స్ కల్నల్, అతని జీవిత భాగస్వామి, కుమారుడు, మరో నలుగురు రైఫిల్మెన్లు మరణించిన విషయం తెలిసిందే అయితే, ఈ దాడిలో చైనాకు చెందిన సైనికులు కూడా పరోక్షంగా పాల్పంచుకున్నట్లు, వారి సహకారంతోనే ఈ దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
కాగా, మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మణిపూర్లోని చురచంద్పూర్ జిల్లాలో శనివారం జరిగిన దాడికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ అనే రెండు మిలిటెంట్ గ్రూపులు శనివారం సంయుక్తంగా బాధ్యత వహించాయి.
వేర్పాటువాద తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు మయన్మార్ శిబిరాల్లో చైనా సైన్యం ద్వారా శిక్షణ పొందారని అనుమానిస్తున్నారని, వారికి ఆయుధాలు కూడా సరఫరా చేయబడే అవకాశం ఉందని ఉన్నత నిఘా వర్గాలు మీడియాకు తెలిపాయి. మణిపూర్ సరిహద్దు పక్కన ఉన్న క్యాంపుల డ్రోన్ వీడియో ఫుటేజీని ఇంటెల్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శిబిరాల్లో చైనా సైన్యానికి చెందిన అగ్రనేతలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

తైవాన్, టిబెట్లోని చైనా వ్యతిరేక లాబీతో భారతదేశం అనుబంధం కొనసాగిస్తున్న క్రమంలో బీజింగ్ కలత చెందుతున్నట్లు ఇంటెలిజెన్స్ సెటప్లోని అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో భారత్కు వ్యతిరేకంగా వేర్పాటువాద సంస్థలకు మద్దతు ఇవ్వడానికి చైనా సిద్ధంగా ఉందని గతంలో ఇన్పుట్లు సూచించాయి.
ఈశాన్య తిరుగుబాటుదారులు మయన్మార్లో చైనా మద్దతు ఉన్న సమూహాలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఈ సమూహాలకు మద్దతు ఇవ్వడం వారి పని అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Recommended Video
ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటు గ్రూపులకు మయన్మార్ సైన్యం కూడా మద్దతు ఇస్తుందని భారతీయ ఏజెన్సీలు భయపడుతున్నాయని పేర్కొన్నాయి, ఇది తన స్వంత మానవశక్తి కొరత కారణంగా సాధారణ పెట్రోలింగ్ కోసం వారిని ఉపయోగిస్తుందని తెలిపాయి. ఈ గ్రూపులు ఉర్ టాగా ప్రాంతాల్లో ఉన్నాయని, అటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని మయన్మార్కు అధికారిక మార్గాల ద్వారా భారత్ తెలియజేసిందని పేర్కొన్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications