ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం, రోమ్ ఒలింపియన్ షాహిద్ హకీమ్ కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ భారత ఫుట్బాల్ క్రీడా దిగ్గజం షాహిద్ హకీమ్(82) గుండెపోటుతో కన్నుమూశారు. గుల్బర్గాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత సంవత్సరం కోవిడ్ను జయించిన హకీమ్.. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు.
హకీమ్ 1950 -1960 మధ్యలో భారత్ ఫుట్బాల్ జట్టుకు విశిష్ట సేవలను అందించారు. సెంటర్ హాఫ్ పొజిషన్లో ఆడే ఈ ఫుట్బాల్ దిగ్గజం1960 రోమ్ ఒలింపిక్స్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అతని క్రీడా జీవితం తరువాత, అతను ఖతార్లో 1988 ఏఎఫ్సీ ఆసియా కప్తో సహా 1989 వరకు 33 అంతర్జాతీయ ఆటలలో ఆధిపత్యం వహించాడు.

అనంతర ఆయన ఫిఫా మ్యాచ్ల్లో అంతర్జాతీయ రిఫరీగా కూడా వ్యవహరించారు. షాహిద్ హకీమ్.. లెజెండరీ ఫుట్బాల్ కోచ్ ఎస్ఎస్ రహీమ్ తనయుడు. షాహిద్ హకీమ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హకీమ్ మృతి పట్ల పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు. హకీమ్ మరణం పట్ల పలువురు మాజీ క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రీడాలోకానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
భారత వైమానిక దళంతో అనుబంధంగా, హకీమ్ స్క్వాడ్రన్ నాయకుడిగా వ్యవహరించారు. అతను 2017 లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కోసం ప్రతిష్టాత్మక ధ్యాన్ చంద్ అవార్డును అందుకున్నాడు. అతను గత దశాబ్ద కాలంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ)లో చీఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశాడు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications