మోడీ సంచలనం: 86 శాతం మనీ వేస్ట్, రూ. 14 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, 1000 నోట్లు చెల్లవని ప్రకటించిన నేపథ్యంలో మంగలవారం అర్థరాత్రి నుంచి దాదాపు రూ.14 లక్షల కోట్లు చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం లెక్కకు రాని డబ్బులు అంతగా చెలామణిలో ఉన్నాయి. అదంతా ఇప్పుడు ఎందుకూ పనికి రాకుండా పోతుంది.
అందులో రూ.500 నోట్ల దాదాపు 7.85 లక్షల కోట్లు కాగా, వేయి రూపాయల నోట్లు రూ.6.33 వరకు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇదంతా నల్ల డబ్బే. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూడు విధాలుగా నల్లధనంపై ప్రభావం చూపుతుంది.

1. అకస్మాత్తుగా ప్రకటన చేయడం వల్లే భారతీయుల వద్ద ఉన్న బ్లాక్ మనీపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే దాన్ని బయటకు తేవడానికి రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి - తమ గుర్తింపును చెబుతూ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని లేదా ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ లోగా డబ్బును మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రాథమికంగా సర్క్యేలేషన్ ప్రకారం - రోజుకు రూ.4 వేల రూపాయల నుంచి ఓ వ్యక్తి గడువులోగా కేవలం 60 వేల రూపాయల మాత్రమే మార్పిడి చేసుకోగలడు. ఈ గడువు ముగిసిన తర్వాత సౌకర్యం కోసం మార్పిడి ప్రక్రియలో వెసులుబాట్లు కల్పించవచ్చు. అయితే, డిపాజిట్లపై పరిమితి లేదు.
2. రహస్యంగా, లెక్క చెప్పకుండా దాచిపెట్టిన డబ్బును గడువులోగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీతో ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ముగిసింది. దానివల్ల దాచిపెట్టిన డబ్బును చూపించడం అంత సులభం కాదు. దానివల్ల దాచిపెట్టిన లేదా లెక్క చూపని డబ్బంతా చిత్తు కాగితాలుగా మారిపోతుంది.
3. నోటుకు ఓటు అనే వ్యవహారం భారత ఎన్నికల్లో పరిపాటిగా మారింది. ఇటువంటి సందర్భాల్లో ఓట్లో కోసం డబ్బులు ఇతర వ్యక్తులకు ఇవ్వడానికి భారీ డబ్బును మోసుకుపోవడం కష్టమవుతుంది.
2011 నుంచి 2016 మధఅయ కాలంలో బ్యాంకు నోట్స్ 40 శాతం పెరిగాయి. రూ. 500 నోట్లను 76 శాతం, వేయి రూపాయల నోట్లను 109 శాతం పెంచారు. నవంబర్ 10వ తేదీ నుంచి కొత్త రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలోకి వస్తాయి. వాటిని రిజర్వ్ బ్యాంక్ మోనిటర్ చేస్తుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications