ఎక్కడ?: రోడ్డుపైనే నిలిచిపోయిన రూ. 1600కోట్లు!
తిరువనంతపురం: అవును. రూ. 1600 కోట్లు రోడ్డుపై నిలిచిపోయాయి. కర్ణాటకలోని మైసూరు నుంచి కేరళ రాజధాని తిరువనంతపురానికి ఈ మొత్తం నగదును తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
భారీ భద్రత మధ్య రెండు భారీ కంటెయినర్లలో డబ్బులు తరలిస్తుండగా అనుకోని అంతరాయం ఏర్పడింది. తమిళనాడులోని కరూర్-అరువంకుర్చి బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా ఓ కంటెయినర్ లారీ ఇంజిన్లో సమస్య వచ్చింది. దీంతో రోడ్డుపైనే ఆ భారీ మొత్తం నగదు ఉన్న లారీ నిలిచిపోయింది.

దీంతో భద్రతాగా వస్తున్న సాయుధ దళాలు, పోలీసులు కంటెయినర్ల వద్ద రక్షణగా నిలిచారు. ఈ భారీ మొత్తం నగదు బ్యాంకులకు సంబంధించినదిగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications