రూ. 300 కోట్ల నకిలీ నోట్లు సీజ్, గూడ్స్ ఆటో, కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో కలకలం !
మైసూరు/బెంగళూరు: నకిలీ నోట్లు చలామణి చయ్యడానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. సుమారు రూ. 300 కోట్ల విలువైన రూ. 2, 000 నకిలీ నోట్లను కర్ణాటకలోని చామరాజనగర జిల్లా రామసముంద్ర పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో నకిలీ నోట్ల స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.
చామరాజనగర తాలుకాలోని అట్టుగుళిపుర సమీపంలో పోలీసులు నాకాబంధి కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన గూడ్స్ ఆటోను పోలీసులు నిలిపారు. పోలీసులను చూసిన వెంటనే ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

ఆ సమయంలో పోలీసులు వెంటాడి ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గూడ్స్ ఆటోలో పరిశీలించగా పోలీసులు దిమ్మతిరిగింది. ఆటోలో రూ. 2, 000 నోట్ల కట్టలు వెలుగు చూశాయి. రూ. 2, 000 నోట్లు పరిశీలించిన పోలీసులు అవి నకిలీ అని గుర్తించారు.
నకిలీ నోట్లు తరలిస్తున్న వ్యక్తి వివరాలు, పూర్తి సమాచారం చెప్పడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. నకిలీ నోట్లను కలర్ జిరాక్స్ చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నకిలీ నోట్లు ఎక్కడ తయారు చేశారు ?, ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారు ? అనే వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో సుమారు రూ. 300 కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటపడటం కలకలం రేపింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications