రూ. 300 కోట్ల నకిలీ నోట్లు సీజ్, గూడ్స్ ఆటో, కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో కలకలం !
మైసూరు/బెంగళూరు: నకిలీ నోట్లు చలామణి చయ్యడానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. సుమారు రూ. 300 కోట్ల విలువైన రూ. 2, 000 నకిలీ నోట్లను కర్ణాటకలోని చామరాజనగర జిల్లా రామసముంద్ర పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో నకిలీ నోట్ల స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.
చామరాజనగర తాలుకాలోని అట్టుగుళిపుర సమీపంలో పోలీసులు నాకాబంధి కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన గూడ్స్ ఆటోను పోలీసులు నిలిపారు. పోలీసులను చూసిన వెంటనే ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

ఆ సమయంలో పోలీసులు వెంటాడి ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గూడ్స్ ఆటోలో పరిశీలించగా పోలీసులు దిమ్మతిరిగింది. ఆటోలో రూ. 2, 000 నోట్ల కట్టలు వెలుగు చూశాయి. రూ. 2, 000 నోట్లు పరిశీలించిన పోలీసులు అవి నకిలీ అని గుర్తించారు.
నకిలీ నోట్లు తరలిస్తున్న వ్యక్తి వివరాలు, పూర్తి సమాచారం చెప్పడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. నకిలీ నోట్లను కలర్ జిరాక్స్ చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నకిలీ నోట్లు ఎక్కడ తయారు చేశారు ?, ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారు ? అనే వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో సుమారు రూ. 300 కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటపడటం కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications