రూ.58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం సీజ్: ఎక్కడ అంటే..?
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని మహారాష్ట్రలో ఐటీ దాడులు చేసింది. జల్నా, ఔరంగబాద్లో పారిశ్రామిక వేత్త ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. అధికారులు అంచనా వేసినట్టు నగదు, బంగారం దొరికింది. ఉక్కు, రియల్ ఎస్టేట్, బట్టల వ్యాపారి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో చూపని నగదు, బంగారం సీజ్ చేశారు.
మొత్తం రూ.390 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. రూ. 58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం సీజ్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ నాసిక్ వింగ్ ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు జల్నా, ఔరంగాబాద్ నగరాల్లోని సదరు వ్యాపారి కార్యాలయాలు, నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించిన విషయం ఆలస్యంగా తెలిసింది. పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఐటీ విభాగానికి 13 గంటల సమయం పట్టింది. కౌంటింగ్ మిషన్లతో లెక్కించడానికి ఆ మేరకు టైం పట్టింది.

మొత్తం 260 మంది అధికారులు, ఉద్యోగులు ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో సోదాలు చేశారు. నగదు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. బంగారం కూడా దగ దగలాడుతూ కనిపించింది. దాదాపు 32 కిలోల సోన పట్టుబడింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications