ఆర్ఎస్ఎస్ ను ఏమి అనలేదు: రాహుల్ గాంధీ యూ టర్న్

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కారణమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ అనలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీం కోర్టుకు తెలిపారు.

ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ ఆరోపణలు చెయ్యలేదని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద మాత్రమే రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని సుప్రీం కోర్టులో చెప్పారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ తరపున అఫిడవిట్ ను కోర్టు స్వీకరించింది.

RSS did not assassinate Mahatma Gandhi, Rahul Gandhi tells Supreme Court

దీంతో రాహుల్ గాంధీకి ఊరట లభించినట్లైంది. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను అవమానించలేదని కపిల్ సిబాల్ సుప్రీం కోర్టులో చెప్పారు. నవంబర్ 1వ తేదికి కేసు విచారణ వాయిదా వేశారు.

గతంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని అన్నారు. దీనిపై ఆర్ఎస్ఎస్ సుప్రీం కోర్టులో పరువునష్టం దావా వేసింది. సుప్రీం కోర్టుతో పాటు మరో రాష్ట్రంలో రాహుల్ గాంధీ మీద ఆర్ఎస్ఎస్ కేసు పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+