ఎన్నికలు: ముస్లీంలీగ్తో ఆరెస్సెస్ జత కడుతోందా?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)... ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్తో జత కట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిపిఐ(ఎం) చేసిన ఈ ఆరోపణలు కేరళలో చర్చనీయాంశమయ్యాయి.
జనవరి 26వ తేదీన ఆరెస్సెస్కు చెందిన గోపాలకుట్టి ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ (ఐయూఎంఎల్) కార్యాలయానికి వెళ్లారు. ఆయన ఐయూఎంఎల్ నాయకులను కలిశారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) వారిపై మండిపడుతోంది.

ఐయూఎంఎల్ నాయకులు తమ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా, లౌకికవాదాన్ని పక్కన పెట్టి ఓట్ల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఐ(ఎం) మండిపడింది. ఐయూఎంఎల్ కేరళలో రాజకీయ పార్టీ. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికలు మే - జూన్ నెలలో జరగనున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆరెస్సెస్ నేత గోపాల కుట్టి ఐయూఎంఎల్ నాయకులను కలిసి పొత్తు పైనే చర్చించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications