ముగిసిన సార్క్ సదస్సు: పప్పు, రోటీలు తిన్న మోడీ... చికెన్, మటన్ లాగించిన షరీఫ్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: రెండు రోజుల 18వ సార్క్ సమావేశాలు ఈరోజుతో ముగిశాయి. రెండవ రోజైన ఈరోజు సార్క్ దేశాలు ఇందన సహకారంపై సంతకాలు చేశాయి. మోటారు వాహనాలు, రైల్వే ఒప్పందాలపై సభ్య దేశాలు మూడు నెలలు గడువు కోరాయి.
ఇక వచ్చే సార్క్ సమావేశాలు పాకిస్ధాన్లో జరుగుతాయని నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా ప్రకటించారు. ఇక ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన సార్క్ దేశాల సదస్సులో భారత్, పాక్ ప్రధానుల మధ్య ఎటువంటి చర్చలూ జరగలేదు.
ఈ సమావేశంలో సార్క్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి భారత్ చేసిన ప్రతిపాదనలను పాకిస్ధాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సదస్సు చివరి రోజైన గురువారం సంప్రదాయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
గురువారం సార్క్ దేశాధినేతలు ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్లు కరచాలనం చేసి పలకరించుకున్నారు. సార్క్ సదస్సులో భాగంగా నేపాల్లో పర్యటించిన ప్రధాని మోడీ సాదాసీదా భోజనం తీసుకున్నారు.
ఖాట్మండ్లోని హోటల్ క్రౌన్ ప్లాజాలో బస చేసిన మోడీ మధ్యాహ్నా భోజనంలో జీరా రైస్, పప్పు, రోటీలను ఆహారంగా తీసుకున్నారు. ఆయన కోసం తక్కువ నూనె వేసి ఆహార పదార్థాలను తయారు చేసినట్టు హోటల్ వర్గాలు వెల్లడించాయి.
రాత్రి డిన్నర్లోనూ ఆయన మితాహారమే తీసుకున్నారని సమాచారం. ఉదయం టిఫిన్లో ఊతప్పం, ఇడ్లీలను చెఫ్లు తయారుచేసి అందించారు. ఇదే సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు చికెన్, మటన్, ఫిష్ తదితరాలతో భారీ మెనూను ఏర్పాటు చేశామని హోటల్ ప్రతినిధులు తెలిపారు.

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు
ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన సార్క్ దేశాధినేతలు నరేంద్రమోడీ, నవాజ్ షరీఫ్, సుశీల్ కొయిరాలా.

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు
సార్క్ సదస్సులో గురువారమైన చివరిరోజు కరచాలనం చేసి పలకరించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్లు.

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు
ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన సార్క్ ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్లు.

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు
సార్క్ సదస్సులో గురువారమైన చివరిరోజు కరచాలనం చేసి పలకరించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్లు.

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు
ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన సార్క్ దేశాధినేతలు నరేంద్రమోడీ, నవాజ్ షరీఫ్, సుశీల్ కొయిరాలా, మహేంద్ర రాజపక్సే, ఆశ్రఫ్ ఘనీ.

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు
ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు
ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన సార్క్ ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్లు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications