Sabarimala: కళ్లు తెరిచిన ప్రభుత్వం, రూ. 20 కోట్లు విడుదల, కుంటిసాకులతో భక్తులకు ఇబ్బంది, లక్ష మంది!
శబరిమల/ పందలం/ కొచ్చి: భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోవడంతో దేవస్వం బోర్డుకు ఆధాయం రావడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం శబరిమల దేవస్వం బోర్డు గురించి పట్టించుకోని కేరళ ప్రభుత్వం ఇప్పుడు కళ్లు తెలిరిచినట్లు ఉంది. శబరిమల ఆయలం నిర్వహణ కోసం, మకరవిలక్కు పండుగ నిర్వహణ కోసం కేరళ ప్రభుత్వం రూ. 20 కోట్లు విడుదల చేసింది. కేరళ ప్రభుత్వం కుంటిసాకులతో అయ్యప్పస్వామి భక్తులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికి లక్ష మంది రాలేదు
కరోనా వైరస్ సాకుతో శబరిమలకు వెళ్లే భక్తులను దాదాపుగా తగ్గించేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమయానికి శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి వెళ్లేవాళ్లు అయితే ఈ సారి డిసెంబర్ 21వ తేదీ సోమవారం వరకు లక్ష మంది భక్తులు కూడా శబరిమలకు వెళ్లలేకపోయారు.

దెబ్బకు కళ్లు తెరిచిన ప్రభుత్వం
ఈ దెబ్బతో ప్రతి ఏడాది శబరిమలకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడిందని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు అంటున్నారు. ఈ ఏడాది శబరిమలలో పని చేసే వివిద శాఖల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైయ్యింది. ఇప్పటికే శబరిమలను ఆదుకోవాలని దేవస్వం బోర్డు నిర్వహకులు కేరళ ప్రభుత్వానికి పదేపదే మనవి చేశారు. పందలం మునిసిపాలిటీ చెయ్యి దాటిపోయిందనే షాక్ లో ఉన్న కేరళ ప్రభుత్వం ఇప్పుడు కళ్లు తెరించింది.

ఇచ్చామంటే ఇచ్చాం అనే సామెత ?
శబరిమల ఆలయ నిర్వహణ కోసం, మకరవిలక్కు పండుగ నిర్వహణ కోసం సోమవారం కేరళ ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఆరు నెలల కాలంలో కేరళ ప్రభుత్వం ఇంతకు ముందు కేవలం రూ. 30 కోట్లు, ఇప్పుడు రూ. 20 కోట్లు శబరిమల నిర్వహణ కోసం విడుదల చేసింది. త్వరలో మకరవిలక్కు, అయ్యప్పస్వాములు మకరజ్యోతి యాత్ర మొదలు కానున్న సందర్బంగా రూ. 20 కోట్లు విడుదల చేసింది.

అయ్యప్ప భక్తుల మకరజ్యోతి యాత్ర
జనవరి 18వ తేదీ వరకు అయ్యప్పస్వాముల మకర జ్యోతి యాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద పందలం మునిసిపాలిటిలో ఘోరపరాజయం చవిచూసిన తరువాత త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అయినా పరువు కాపోవడుకోవడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications