Sadist: వేడివేడిగా కిచడీ చేసి పెట్టిన భార్య, ఆవేశంతో ఊగిపోయి భార్యను చంపేసిన భర్త, అసలు మ్యాటర్ !
థానే/మంబాయి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు భార్య వైపు, భర్త వైపు బంధువులు అందరి ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నచిన్న విషయాల్లో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. అందరి ఇళ్లల్లో ఉండే గొడవలే కదా అంటూ పెద్దలు కూడా దంపతుల విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. గొడవ పడటం, రెండు మూడు రోజులకు మళ్లీ ఒక్కటి అయిపోతున్న దంపతులను చూసి వీళ్లు మామూలే అని వదిలేస్తున్నారు. ఉదయం బాగా ఆకలిగా ఉందని భర్త చెప్పాడు. భార్య వేడివేడిగా కిచడి చేసి భర్తకు వడ్డించింది. ప్లేట్ లో ఉన్న కిచడి తింటున్న సమయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో భర్త ఆవేశంతో ఊగిపోయాడు. భర్తకు ఎక్కడో మండిపోయి భార్యను పట్టుకుని చితకబాదేశాడు. కందపడిపోయిన భార్యను దారుణంగా చంపేసిన భర్త అతను తింటున్న కిచడి ప్లేట్ తీసుకుని ఇంటి బయటకు విసిరేశాడు.
మొదట్లో దంపతుల హ్యాపీలైఫ్
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భయందర్ టౌన్ షిప్ లో నీలేష్ గాగ్ అలియాస్ నీలేష్ (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 16 సంవత్సరాల క్రితం నిర్మలా (41) అనే మహిళను నీలేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నీలేష్, నిర్మలా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం చేసుకున్న తరువాత నీలేష్, నిర్మలా దంపతులు భార్య వైపు, భర్త వైపు బంధువులు అందరి ఇళ్లకు వెళ్లి వస్తున్నారు.
భర్తకు కోపం చాలా ఎక్కువ
నిర్మలా, నీలేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నచిన్న విషయాల్లో నీలేష్, నిర్మలా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. అందరి ఇళ్లల్లో ఉండే గొడవలే కదా అంటూ పెద్దలు కూడా నీలేస్, నిర్మలా దంపతుల విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. నిర్మలా భర్త నీలేష్ కు కోపం చాలా ఎక్కువ అని అతని బంధువులు, స్నేహితులు అంటున్నారు.
కిచడీ తెచ్చిన తంటాలు
కొంతకాలం నుంచి నీలేష్, నిర్మలా దంపతుల గొడవలను వాళ్లు బంధువులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. గొడవ పడటం, రెండు మూడు రోజులకు మళ్లీ ఒక్కటి అయిపోతున్న నీలేష్, నిర్మలా దంపతులను చూసి వీళ్లు మామూలే అని వదిలేస్తున్నారు. ఉదయం బాగా ఆకలిగా ఉందని నీలేష్ అతని భార్య నిర్మలాకు చెప్పాడు. భార్య నిర్మలా వేడివేడిగా కిచడీ చేసి ఆమె భర్త నీలేష్ కు వడ్డించింది.
కిచడీలో ఉప్పు ఎక్కువైయ్యిందిని భర్త ఫైర్
ప్లేట్ లో ఉన్న కిచడీ తింటున్న సమయంలో నీలేష్, నిర్మలా దంపతుల మద్య మళ్లీ గొడవ జరిగింది. కిచడీలో ఉప్పు ఎక్కువగా వేశావని, మనుషులు ఎవరైనా దీనిని తింటారా అంటూ నీలేష్ రెచ్చిపోయాడు. మనుషులు తినకపోతే నువ్వు తింటున్నావు కదా అనే టైపులో నిర్మలా ఆమె భర్త నీలేష్ కు ఎగతాలిగా సమాధానం ఇచ్చిందని తెలిసింది.
ఉప్పు విషయంలో భార్యను చంపేసిన భర్త
దంపతుల మద్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో నీలేష్ ఆవేశంతో ఊగిపోయాడు. నీలేష్ కు ఎక్కడో మండిపోయి అతని భార్య నిర్మలాను పట్టుకుని చితకబాదేశాడు. కిందపడిపోయిన భార్య నిర్మలాను దారుణంగా చంపేసిన ఆమె భర్త నీలేష్ అతను తింటున్న ఉప్పు ఎక్కువైన కిచడీ ప్లేట్ తీసుకుని ఇంటి బయటకు విసిరేశాడు. కిచడీలో ఉప్పు ఎక్కువైయ్యిందని భార్య నిర్మలాను దారుణంగా హత్య చేసిన ఆమె భర్త కొన్ని గంటల్లోనే చిక్కిపోయాడని కేసు విచారణ చేస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారని పీటీఐ వార్త సంస్థ తెలిపింది. ఇటీవల మహారాష్ట్రలోని థానేలో టిఫిన్ త్వరగా పెట్టలేదని మామ ఆయన తుపాకితో కోడలి కాల్చిపారేసిన విషయం తెలిసింది.