Wife: శాడిస్టు భర్త, సైకో ఫ్రెండ్స్, భార్య మీద ఐదు మంది ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన భర్త, రాత్రి !
చంఢీగఢ్/పంజాబ్: రెండు రాష్ట్రాలకు చెందిన యువతి, యువకుడికి పెళ్లి కుదిరింది. పెద్లలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోంగా కాపురం చెయ్యడం మొదలుపెట్టారు. పెళ్లి చేసుకున్న యువతికి 20 ఏళ్లు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా తన భార్యను ఎవరైనా కన్నెత్తి చూసినా భర్త తట్టుకోలేడు. అదే భార్య అడ్డదారి తొక్కినా భర్త సహించలేడు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న భార్య తీరుతో భర్త చాలాకాలంగా రగిలిపోతున్నాడు. భార్యను బైక్ లో పిలుచుకుని బయలుదేరాడు. ఓప్రాంతానికి వెళ్లి బైక్ ఆపాడు. ఆ సందర్బంలో ఐదు మంది యువకులు వెనుక నుంచి వచ్చారు. అంతే భార్య మీద ఐదు మంది యువకులు గ్యాంగ్ రేప్ చెయ్యడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చిన ఆమె చూస్తే అక్కడ గ్యాంగ్ రేప్ చేసిన ఐదు మందితో పాటు భర్త కూడా మాయం కావడంతో మహిళ హడలిపోయింది.
ఏడాది క్రితం పెళ్లి
జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్కు చెందిన 20 ఏళ్ల యువతికి గతఏడాది క్రితం పంజాబ్కు చెందిన యువకుడితో వివాహమైంది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో ఇరువైపుల బంధువుల ఇళ్లకు రెండు నెలల పాటు కొత్త జంట తిరిగారు. తరువాత దంపతుల మద్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఇరువైపుల కుటుంబ సభ్యులు దంపతులకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే ఓ వియంలో భర్త కొంతకాలంగా అతని భార్య మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని తెలిసింది.
ప్రమాదంలో భార్యకు గాయాలు
కొన్ని నెలల క్రితం భార్య మేడమీద మెట్ల మీద నుంచి జారిపడటంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలైనాయని తెలిసింది. కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో నడవడానికి కొన్ని రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. కానీ భర్త అతని భార్యకు మెరుగైన చికిత్స అందించడానికి ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆ యువతి ఆమె సోదరుల వద్దకు వెళ్లి అక్కడే చికిత్స చేయించుకుంది. రానురాను ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. మహిళ నడవడం ప్రారంభించింది.
రాజీకి వెళ్లిన భర్త
భార్య నడుస్తుందని, ఆమె ఏదో ఒక పని చేస్తే ఆర్థికంగా తనకు ఉపయోగపడుతుందని అనుకున్న భర్త అతని భార్యతో రాజీకి వెళ్లాడు. తరువాత భర్త అతని ఇంటికి భార్యను పంజాబ్ లోని ఉదంపూర్ లోని అతని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు తరువాత దంపతుల మధ్య పెద్దగా గొడవ జరగలేదని తెలిసింది. భర్త మారిపోయాడని అతని భార్య మురిసిపోయింది. భార్య ఆమె భర్తఇంట్లోనే ఉండడిపోయింది.
పక్కాప్లాన్ చేసిన శాడిస్టు మొగుడు
ఈనెల 7వ తేదీన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కొన్ని గంటల తరువాత భార్యకు ఫోన్ చేసిన భర్త జండియాలలోని వాల్మీకి చౌక్ దగ్గరకు రావాలాని భార్యకు చెప్పాడు. భర్త ప్రేమగా పిలవడంతో అతని భార్య సంతోషించింది. తనను సినిమాకు పిలుచుకుని వెలుతాడని, లేదంటే షాపింగ్ కు పిలుచుకుని వెలుతాడని ఇలా భార్య రకరకాలుగా ఊహించుకుంది. అందంగా రెఢీ అయిన భార్య ఆమె భర్త చెప్పిన వాల్మీకి చౌక్ దగ్గరకు వెళ్లింది.
బైక్ లో పిలుచుకుని వెళ్లిన భర్త
భార్య కోసం వాల్మీకి చౌక్ దగ్గర వేచి ఉన్న భర్త ఆమెను బైక్పై ఎక్కించుకుని నగరంలో బయట నివాస ప్రాంతాలు లేదని చోటకు వెళ్లాడు.
ఏం జరుగుతుందో అర్థంకాక ఎక్కడికి వెళ్తున్నారని భార్యా ఆమె భర్తను ప్రశ్నించింది. ఊరిబయటకు ఎందుకు పిలుచుకుని వెలుతున్నావని భార్య ఆమె భర్తను అడింది. కొంత సేపు అలాగే బైక్ నడిపిన భర్త ఊరికి చాలా దూరంలోని ముళ్ల పొదల దగ్గర బైక్ నిలిపి నువ్వు కిందకు దిగు అని భార్యకు చెప్పాడు.
భార్యను ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన భర్త
ముళ్లపొద పక్కన అప్పటికే భర్త స్నేహితులు ఐదు మంది ఉండటంతో భార్య షాక్ అయ్యింది. భర్తతో పాటు ఆ ఐదు మంది కలిసి మహిళ మీద విరుచుకుపడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏం జరుగుతుందో అని భార్య అంచనా వేయకముందే కామాంధులు రెచ్చిపోయారు. తనను వదిలేయాని భార్య ఎంతో ప్రాధేయపడింది. అయితే ఆ సమయంలో భర్తతో పాటు అతని స్నేహితులు ఆమె మీద దాడి చేశారు. తనను వదిలేయాలని, నేను మా ఊరికి వెళ్లిపోతానని భార్య ప్రాదేయపడినా భర్త అతని స్నేహితులు మాత్రం ఆమెను వదల్లేదు.
భార్య బట్టలు మొత్తం చింపేసి రాత్రి అక్కడే వదిలేసి ?
ఆరు మంది పదేపదే మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి. అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో షాక్కు గురైన మహిళ అక్కడే స్పృహతప్పి పడిపోయింది. కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చిన మహిళ ఆమె శరీరం చూసుకుంటే బట్టలన్నీ చిరిగిపోయాయి భర్తతో పాటు ఆరు మంది పారిపోయారని తెలుసుకుంది. స్థానికుల సహాయంతో పాతీ బట్టలు వేసుకుని అతి కష్టం మీద తప్పించుకున్న మహిళ జమ్మూకాశ్మీర్ లోని ఆమె తమ్ముడి ఇంటికి చేరుకుంది. తన భర్త అతని స్నేహితులతో కలిసి తన మీద గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు బోరున విలపించడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.
భర్త చిక్కితే ఉంటుంది నాసామిరంగా !
గ్యాంగ్ రేప్ కేసు పెట్టాలని, నీ భర్తకు కఠినశిక్ష పడాలని మహిళ కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సోదరుల ప్రతిపాదనకు ఆమె మొదట అంగీకరించలేదు. నీకు అండగా జీవితాంతం మేము తోడుగా ఉంటామని సోదరులు ఆమెకు భరోసా ఇవ్వడంతో బుధవారం బాధితురాలు పంజాబ్ చేరుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో సహ ఆరు మంది మీద గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు. మహిళ కేసు పెట్టిందని తెలుసుకున్న భర్తతో సహ ఆరు మంది పరారైనారు. త్వరలో భర్తతో పాటు ఆరు మందిని పట్టుకుంటామని పంజాబ్ పోలీసులు అంటున్నారు. భార్య మీద కోపంతో భర్త అతని ఐదు మంది స్నేహితులతో కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చెయ్యడం పంజాబ్ లో కలకలం రేపింది. పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో సీరియస్ అయ్యిందని తెలిసింది.