మోడీ గెలుపు: యశోదాబెన్ను ఊర్మిళాదేవితో పోల్చిన సాక్షి మహారాజ్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ వున్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్కే పురం సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్ను రామాయణంలో లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవితో పోల్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఘన విజయానికి కారణం యశోదాబెన్ అని సూత్రీకరించారు. రాముడితోపాటు లక్ష్మణుడు కూడా వనవాసం వెళ్లాడని, అయితే ఆ సమయంలో లక్ష్మణుడి భార్య వనవాసం వెళ్లకుండా తపస్సులో మునిగిపోయిందని తెలిపారు.

ఆమె తపస్సే లక్ష్మణుడికి శక్తినిచ్చిందని, తద్వారా యుద్ధంలో వీరోచితంగా పోరాడగలిగాడని సాక్షి మహారాజ్ వివరించారు. అదే విధంగా మోడీ విజయం వెనక యశోదాబెన్ ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధి బాధ్యతలు మోడీ స్వీకరిస్తారని, దేశాన్ని ఎలా నడిపిస్తున్నారో.. అలేగా ఢిల్లీని కూడా పురోగామి పథంలో తీసుకెళతారని సాక్షి మహారాజ్ చెప్పారు.
ఢిల్లీ సిఎం అభ్యర్థిని బిజెపి ఎంపిక చేస్తుందని చెప్పిన సాక్షి మహారాజ్.. బిజెపికి ఓట్లు గెలిపించాలని కోరారు. కాగా, గత సెప్టెంబర్ నెలలో ఆయన మాట్లాడుతూ.. మదర్సాలు ఉగ్రవాదులకు స్థావరాలుగా మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. మత సంబంధమైన పాఠశాలల్లో జాతీయతను పెంపొందించేలా భోదనలు జరగడం లేదని అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications