సమాజ్ వాదీలో ముసలం: ఆరుగురు శివపాల్ యాదవ్ సన్నిహితులపై వేటు
సమాజ్ వాదీ పార్టీలో కల్లోలం మళ్ళీ మొదలైనట్టు కన్పిస్తోంది. శివపాల్ యాదవ్ కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై పార్టీ సస్పెన్షన్ వేటేసింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తోందని పార్టీ ప్రకటించింది.
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో కల్లోలం మళ్ళీ మొదలైనట్టు కన్పిస్తోంది. శివపాల్ యాదవ్ కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై పార్టీ సస్పెన్షన్ వేటేసింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తోందని పార్టీ ప్రకటించింది.
సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా అనే పేరుతో కొత్త ములాయం సింగ్ తమ్ముడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే శివపాల్ మద్దతుదారులపై సస్పెన్షన్ వేటు పడింది.

స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులెవరో రాజకీయాల్లో ఉన్న తమకు బాగా తెలుసునని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు.
తన కొడుకుని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశానని అంతకుముందు ములాయం సింగ్ వ్యాఖ్యానించారు.అంతేకాదు కాంగ్రెస్ తో చేతులు కలిపి పార్టీని నాశనం చేశాడని ఆయన ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications