సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుడు కేసు: అసీమానందతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు
పంచకుల: సంఝౌతా ఎక్స్ప్రెస్లో బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ హర్యానాలోని పంచకులా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అసీమానంద్ స్వామి కూడా ఉన్నారు. ఇక ఈయనతో పాటు నిర్దోషులుగా కోర్టు ప్రకటించిన వారిలో లోకేష్ శర్మ, కమల్, చౌహాన్, రాజిందర్ చౌదరిలు ఉన్నారు. వీరందరిని పంచకులలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
ఫిబ్రవరి 18, 2007లో హర్యానాలోని పానిపట్కు సమీపంలో ఉన్న సంఝౌతా ఎక్స్ప్రెస్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 68 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో అధికంగా పాకిస్తాన్ జాతీయులు ఉండగా భారత రైల్వే అధికారులు నలుగురు మృతి చెందారు. ఓ బోగీలో బాంబు పేలడంతో ఈ ఘటన జరిగింది. సంఝౌతా ఎక్స్ప్రెస్ అమృత్సర్లోని అటారీకి వెళుతున్న సమయంలో పేలుడు సంభవించింది.

2010 జూలైలో కేసును జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేయడం జరిగింది. విచారణ చేసిన ఎన్ఐఏ 2011 జూన్లో చార్జిషీటు దాఖలు చేసింది. ఎనిమిది మందిపై ఛార్జిషీటు వేసింది. ఈ కేసులో మొత్తం 200కు పైగా సాక్షులను విచారణ చేసింది ఎన్ఐఏ. ఇక ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ విచారణ పేరుతో పాక్ దేశస్తుల నుంచి సేకరించిన వాంగ్మూలాలను రద్దు చేయాలని కోరుతూ మార్చి 11న పాకిస్తాన్లో నివాసం ఉండే రాహిలా వకీల్ అనే వ్యక్తి అడ్వకేట్ మోమిన్ మాలిక్ ద్వారా అనుమతి కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును కోర్టు తోసి పుచ్చింది.
Samjhauta Blast Case: Visuals of Aseemanand from Panchkula Court. He and three others were acquitted by Court. #Haryana pic.twitter.com/chjsCm28IS
— ANI (@ANI) March 20, 2019
సంఝౌతా ఎక్స్ప్రెస్ కేసుకు సంబంధించి సాక్షాధారాలను కోర్టు ముందుంచడంలో ఎన్ఐఏ విఫలమైందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం నిర్దోషులను విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీరందరినీ విడుదల చేయడం జరిగిందని ఎన్ఐఏ తరపున న్యాయవాది ఆర్కే హందా తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications