బీజేపీలో చేరిన పహల్గాం ఉగ్రవాదులు: సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆరుగురు టెర్రరిస్టులు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు. అందుకే ఇప్పటివరకూ ఆ ఉగ్రవాదులను మోదీ ప్రభుత్వం పట్టుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు.
శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ .. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. గతంలోనూ బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులు త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అందుకే బీజేపీ వాళ్లను పట్టుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు సంజయ్ రౌత్. " పహల్గాం ఉగ్రవాదులు బీజేపీలో చేరి ఉండవచ్చు. అందుకే వాళ్లను బీజేపీ పట్టుకోవడం లేదు. ఏదో ఒకరోజు బీజేపీ కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ వస్తుంది. అందులో పహల్గాం ఉగ్రవాదులు బీజేపీలో చేరారు అని ఉంటుంది" అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలను బీజేపీ నాయకుడు రామ్ కథమ్ తీవ్రంగా ఖండించారు. రౌత్ వ్యాఖ్యలు హీనమైన చర్యగా అభివర్ణించారు. ఆయన మాటలు భారత త్రివిధ దళాలను కించ పరిచే విధంగా ఉన్నాయని అన్నారు. సంజయ్ రౌత్, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరికీ మైండ్ పనిచేయడం లేదని ఆరోపించారు. వాళ్లను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.
Mumbai, Maharashtra: Shiv Sena (UBT) leader Sanjay Raut says, "Maybe the terrorists have joined the BJP, that’s why they are not being caught. The six terrorists from Pahalgam are not being caught, perhaps because one day you will receive a press note from the BJP office saying… pic.twitter.com/bnBYn7ngSS
— IANS (@ians_india) May 30, 2025
శివసేనకు చెందిన సంజయ్ నిరుపమాన్.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని అన్నారు. నిజం ఏంటంటే.. శివసేన(యూబీటీ)పార్టీ బీజేపీలో చేరాలని అనుకుంటోంది. కానీ బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని తెలిపారు. దీంతో ఫ్రస్టేషన్ లో వాళ్లు మాట్లాడుతున్నారని సంజయ్ నిరుపమాన్ అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications