శంకరరామన్ హత్య కేసు: కంచి స్వాములకు ఊరట
పుదుచ్చేరి: శంకరరామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతులకు బుధవారం ఊరట లభించింది. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా మొత్తం ఇరవై మూడు మందిని పాండిచ్చేరి కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును ఈ రోజు వెలువరించింది.
నిందితుల ప్రమేయం పైన దర్యాఫ్తు బృందం సరైన ఆధారాలు చూపించక పోవడంతో వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు పదేళ్ల క్రితం.. 2004 సెప్టెంబరు నెల 3వ తేదిన శంకరరామన్ హత్య జరిగింది. ఈ కేసులో కంచిపీఠాధిపతులతో సహా ఇరవై మూడు మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
శంకరరామన్ హత్య కేసులో దర్యాఫ్తు బృందం 189 మందిని విచారించింది. ఈ కేసు విచారణ తమిళనాడులోని చెంగల్పేట కోర్టు నుండి పాండిచ్చేరి కోర్టుకు మార్చాలని జయేంద్ర సరస్వతి కోరారు. దీంతో సుప్రీం కోర్టు తీర్పుతో విచారణను పాండిచ్చేరి కోర్టుకు మార్చారు. ఇప్పుడు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ కేసుకు సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం జయేంద్ర సరస్వతి పాత్ర పైనే దర్యాఫ్తు జరిగిందని, దర్యాఫ్తు నిష్పక్షపాతంగా జరగలేదని పాండిచ్చేరి కోర్టు అభిప్రాయపడింది.
2004లో ఆలయ ప్రాంగణంలో హత్య జరిగింది. దీనికి సంబంధించి 23 మంది పైన కేసు నమోదయింది. కాంచీపురంలోని చెంగల్పట్టు కోర్టు విచారణ చేపట్టింది. తమిళనాడులో నిష్పక్షపాతమైన విచారణ జరగదని జయేంద్ర సరస్వతి సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో 2005లో పాండిచ్చేరి కోర్టుకు బదలీ అయింది. ఈ కేసు విచారణ తొమ్మిదేళ్లు సాగింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications