జయ మృతి: ఇంటర్వ్యూ లో నోరు విప్పిన శశికళ, నిజం చెప్పేసి ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మొదటి సారి మీడియా ముందు నోరువిప్పారు. జయలలిత గురించి పూర్తి వివరాలు మొత్తం ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో నెచ్చెలి శశికళ నటరాజన్ చెప్పేశారంట.
జయలలితతో ఎలా పరిచయం అయ్యింది ? తరువాత స్నేహం ఎలా అనుబంధంగా మారింది ? మద్యలో వచ్చిన సమస్యలు ఏమిటి ? తన సోదరుడి కుమారుడిని జయలలిత ఎందుకు దత్తత తీసుకున్నారు ? తరువాత ఎందుకు అతన్ని దూరం చేశారు ? అని నెచ్చెలి శశికళ ఇంటర్వూలో చెప్పారంట.
ప్రముఖుల మనసులోని అన్ని వివరాల గురించి ప్రపంచానికి చాటి చెబుతున్న 'Provoke LifeStyle Magazine' అనే పత్రికకు నెచ్చెలి శశికళ మొదటి సారి ఇంటర్వూ ఇచ్చారు. ఆ పత్రిక 2017 జనవరి మొదటి వారంలో విడుదల అవుతున్నది.
శశికళ ఇచ్చిన ఇంటర్వూలో జయలలిత ఆసుపత్రిలో చేరిన్నప్పటి నుంచి ఏం జరిగింది ? చికిత్స ఎలా చేశారు ? ఆమ్మ అనారోగ్యానికి అసలుకారణాలు ఏమిటి ? అని శశికళ పూర్తిగా వివరించారని నెచ్చెలి సన్నిహితులు అంటున్నారు.

శశికళ ఇచ్చిన ఇంటర్వూ వివరాలు బయటకు వస్తే జయలలిత ఎలా మృతి చెందారు అని ఇప్పటి వరకు ప్రజలలో ఉన్న అనుమానాలు కొంతవరకైనా తొలుగుతాయని అమ్మ అభిమానులు అంటున్నారు.
ఎప్పుడు ఆ పత్రిక బయటకు వస్తుందా ? అని అమ్మ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో జయలలిత తన ఆస్తులకు ఎవరు వారసులు ? రాజకీయ వారసులు ఎవరు ? అమ్మ వీలునామాలో ఏమి ఉంది ? అనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలతో పాటు సీఎం కుర్చి కావాలని ఆశగా ఎదురు చూస్తున్న శశికళ అసలు విషయాలు బయటకు చెప్పారా ? లేదా ? అనే అనుమానాలు ఉన్నాయని ఆమె వ్యతిరేక వర్గం నాయకులు అంటున్నారు.
మొత్తం మీద శశికళ మొదటి సారి నోరు తెరచి మీడియాకు ఇంచిన ఇంటర్వూలో ఏమి చెప్పారు ? అని తమిళనాడు ప్రజలతో పాటు దేశం మొత్తంగా ఉన్న అమ్మ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ పత్రిక బయటకు వస్తే హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయని అంటున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications