పొయెస్గార్డెన్పై మరో ట్విస్ట్: శశికళ మరదలి పేరుతో ‘వేదనిలయం’ వీలునామా!
దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన ఇంటిని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మరదలు ఇళవరసికి చెందేలా వీలునామా రాశారా? అవుననే వాదనలే వినిపిస్తున్నాయి.
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన ఇంటిని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మరదలు ఇళవరసికి చెందేలా వీలునామా రాశారా? అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పొయెస్ గార్డెన్ లేదా వేదనిలయాన్ని జయ స్మారకంగా మారుస్తామని పన్నీర్ సెల్వం ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఆన్లైన్లో జయ పేరిట ఓ వీలునామా వెలుగులోకి రావడం సంచలనమైంది.

వేదనిలయాన్ని ఇళవరసికి చెందేలా వీలునామా రాసినట్లు శశికళ వర్గాలు వెల్లడించాయని తమిళ మీడియాలో ఓ కథనం వచ్చింది. వీలునామా పత్రాల్లో జయలలిత సంతకం కూడా కనిపిస్తోంది. కానీ దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే జయ 2016లో ఎన్నికల్లో పోటీ చేసినపుడు సమర్పించిన అఫిడవిట్లో ఈ వేద నిలయం ఆమె పేరిటే ఉంది. కొన్ని రోజుల్లోనే ఆమె వీలునామా రాసి ఉండర ని.. పేర్కొంటున్నారు. ఈ వీలునామా నిజమేనని తేలితే పొయెస్ గార్డెన్ శశికళ కుటుంబానికే దక్కుతుంది. లేదంటూ పన్నీరు సెల్వం ఆదేశాల మేరకు స్మారకం కానుంది.












Click it and Unblock the Notifications