ఇక స్టేట్ బ్యాంక్ ఏటీఎంలలో రూ.20, 50 నోట్లు!
న్యఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర కొరతను తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ మహత్తర నిర్ణయానికి ముందుకు వచ్చింది. ఇక నుంచి ఎస్బీఐ
ఏటీఎంలలో రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లు వచ్చే విధంగా త్వరలో ఏర్పాట్లు చేస్తామని భారతీయ స్టేట్ బ్యాంకు సోమవారం ప్రకటించింది.

దీంతో ఏటీఎంల నుంచి రూ.2000, రూ.500, రూ.100 నోట్లే కాదు.. రూ.20, రూ.50 నోట్లు కూడా తీసుకోవచ్చన్నమాట. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు.
ప్రస్తుత రద్దీ తగ్గిన తరువాత అందుకు తగ్గ మార్పులు చేస్తామని ఆ బ్యాంకు ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. కాగా, ఇప్పటికే రూ. 2000, 500ల నోట్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications