SBI: ఖాతాదారులకు షాకివ్వనున్న ఎస్బీఐ.. ఆ ఛార్జీలు పెంపు..!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఎస్బీఐ డెబిట్ కార్డు మెయింటనెన్స్ ఛార్జీలను పెంచింది. గరిష్ఠంగా రూ.75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనం. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్ డెబిట్ కార్డులపై బ్యాంక్ రూ. 125 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు దాన్ని పెంచింది.
ఏప్రిల్ నుంచి ఈ ఛార్జీని రూ.200 పెంచింది. ఇక గోల్డ్, కాంబో, యువ కార్డులపై ప్రస్తుతం రూ.175 మెయింటనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.250కి పెంచనున్నారు. ప్లాటినం డెబిట్ కార్డుకు ప్రస్తుతం రూ.250 తీసుకుంటుండగా.. ఏప్రిల్ 1 నుంచి రూ.325 వసూలు చేస్తారు. బిజినెస్ ప్రీమియం, ఫ్రైడ్ కార్డులపై ప్రస్తుతం సంవత్సరానికి రూ.350 వసూలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రూ.425 వసూలు చేయనున్నారు.

ఎస్బీఐ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కూడా పలు సవరణలు చేశారు. రూ. 25,000 వరకు మెయింటెన్ చేసేవారు ఇతర బ్యాంకు ఏటీఎంల్లో నెలకు 3 ఫ్రీ ట్రాన్స్ క్షన్స్ చేయవచ్చు. ఏస్బీఐ ఏటీఎంల్లో అయితే 5 ఉచిత లావాదేవీలు పొందవచ్చు. రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు ఖాతాలో ఉంచుకునేవారు ఇతర బ్యాంకు ఏటీఎంల్లో 3 ఉచిత లావాదేవీలు ఎస్బీఐ ఏటీఎంల్లో అన్ లిమిటెట్ లావాదేవీలు చెయ్యొచ్చు. మెట్రో నగరాల్లో అయితే రూ. 50,000 నుంచి రూ. 1,00,000 మెయింటెన్ చేసేవారు ఇతర బ్యాంకు ఏటీఎంల్లో నెలకు 3 ఉచిత, ఏస్బీఐ ఏటీఎంల్లో అయితే 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.
రూ. 1,00,000 పైన ఖాతాలో ఉంచుకునే వారు ఇతర బ్యాంకులు, ఎస్బీఐ ఏటీఎంల్లో అన్ లిమిటెడ్ లావాదేవీలు పొందవచ్చు. ఖాతాలో త్రైమాసికంలో సగటున రూ. 25,000 బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలట. లేకుంటే డెబిట్ కార్డ్ హోల్డర్ల నుంచి త్రైమాసికానికి రూ. 12 (GSTతో సహా) జరిమానా విధిస్తారట.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications